Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమే భానువాసరే...' ఇత్యాదిగా చెప్పుకుంటారు. దీనినిబట్టి మనవారు మనకు ఎటువంటి కాల స్వరూపాన్ని ఏర్పరచింది, దాన్ని మనం ఎలా నిత్యజీవితంలో వినియోగించుకుంటున్నదీ వ్యక్తమవుతున్నది.

మనకు నేటి సంవత్సరాదితో ఆరంభమయ్యే జయనామ సంవత్సరం నాటికి చతుర్విధమానాలు ఈ రీతిగా గడిచాయి. సృష్ట్యాదిగా గడిచిన సంవత్సరాలు 1655885054. జయతో 1655885055 ప్రారంభమైంది. ఇప్పటి బ్రహ్మకు ద్వితీయ పరార్ధము. ఆయన 50 సంవత్సరాలు గడిచి ఏబది ఒకటో సంవత్సరం మొదటి దినం జరుగుతున్నది. ఈ దినానికే కల్పమని పేరు.[1] మొదటి దినం కనుక శ్వేత వరాహకల్పము. మొదటి దినంలో పగటివేళ ఘ 13 వి. ఘడియలు గడిచినవి. స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, చాక్షుస, రైవత, వైవస్వత, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, దేవసావర్ణి, ఇంద్రసావర్ణి - ఈ పదునాల్గురు మనువుల్లో ఆరుగురి మన్వంతరాలు గడిచిపోయినవి. ఏడవ దైన వైవస్వత మన్వంతరంలోని డెబ్బది మహాయుగాలలో ఇరువది ఏడు గడిచిపోగా, ప్రస్తుతము నడుస్తున్న 28వ మహాయుగంలోని చతుర్యుగాలలో కృత, త్రేత, ద్వాపరాలు అయిపోయినవి. నాల్గవ దైన కలియుగంలో ప్రథమ పాదం నడుస్తున్నది.[2]

కలియుగానికి 4,32,000 మానవాబ్దాలు. అందులోని ప్రథమ పాదంలో జయనామ సంవత్సరం నాటికి 5054 గడిచిపోయినవి. జయతో 5055 ప్రవేశించింది. ఇక కలిలో శేషాబ్దాలు 426945.
ప్రతి అరవై సంవత్సరాలకూ ప్రభవాది నామాలు చెల్లుతూ ఉండటం ఆంధ్రులందరికీ తెలిసిందే. ఈ అరవై సంవత్సరాల ప్రమాణం దేవతలకు ఒక ఋతువు. ఈ అరవై సంవత్సరాలల్లో జయ, ఇది చాంద్రమానాన్ని బట్టి.

సంవత్సరాల సంఖ్యను చెప్పుకోటానికి అన్ని దేశాలలోను, ఏదో ఒక అబ్దం ఆచారంలో ఉంది. మన దేశంలో ఇటువంటివి షట్శకాలున్నట్లు తెలుస్తున్నది. అవి 1. యుధిష్ఠిర శకము. 2. విక్రమార్క శకము 3. శాలివాహన శకము 4. విజయాభి నందన శకము 5. నాగార్జున శకము 6. కల్కి శకము. యుధిష్ఠిర విక్రమార్కశకాల మధ్యకాలంలో భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలోనైనా సప్తర్షియుగము, మహేశ్వరాబ్దము వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది.[3] ప్రాచీన భారతదేశంలో స్వర్ణయుగాన్ని కల్పించిన గుప్తుల పేర ఒక శకం కన్పిస్తున్నది.[4]పూర్వపు ఒరిస్సా

మూలములు

  1. 3. బ్రహ్మ మాసానికి 30 తిథులు (దినాలు) శ్వేతవరాహము, నీలలోహితము, వామదేవము, రథంతరము, గౌరవ, దేవ, బృహత్, కందర్ప, సత్య, ఈశాన, తమః, సారస్వత, ఉదాన, గారుడ, కౌర్మ, నారసింహ, సమాన, ఆగ్నేయ, సోమమానవ, తత్పురుష, వైకుంఠ, లక్ష్మీ, సావిత్రీ, ఘోర, వరాహ, వైరాజ, గౌరీ మహేశ్వర పితృకల్పములు.
  2. 4. కలియుగం క్రీ.పూ. 3102 ఫిబ్రవరి 20 తేదీన గం.2 ని. 17 సెకండు 30న ఆరంభమైందని మనవారు సిద్ధాంతీకరించారు. వైవస్వత మన్వంతరానికి ఇంద్రుడు పురందరుడు, ఆదిత్యుడు, మరుత్తులు, అశ్విని, పసుపు, రుద్రుడు ఇత్యాదులు దేవతలు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, జమదగ్నులు సప్తర్షులు. సప్తర్షులు మన్వంతరాన్ని బట్టి మారుతుంటారు. సప్తర్షులను గురించి చూ. భారతి ఈశ్వర చైత్రము; భారతి ఈశ్వర మాఘము; వీరిలో కొందరు ప్రజాపతుల్లో ఉన్నారు. ప్రజాపతులు రవిసోమాది గ్రహాలనటానికి చూ. Planets, Prajapatis and plexuses - C. J. Ghatak Astro, Maga... No. 1 pp 70-73
  3. 5. ప్రాచీన ఖగోళము శ్రీ వేలూరి శివరామశాస్త్రి, భారతి - సర్వధారి. పు. 604
  4. 6. గుప్తశకం. క్రీ.శ. 320లో ప్రారంభమైనదని డాక్టరు ఫ్లీట్ (1. A.Val X VIII)

364

వావిలాల సోమయాజులు సాహిత్యం-4