పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భగవాన్ శ్రీకృష్ణ

శ్రీకృష్ణాయ నమః

"యదా యదా హి ధర్మస్యగ్లాని రృవతి భారత! ।
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజా మ్యహం ||"
"పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం !
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే |”

"ధర్మచ్యుతి కలిగి అధర్మము ప్రబలినపుడు నన్ను నేను సృజించుకొంటాను. దుష్ట సంహారం చేసి శిష్టులను రక్షించి ధర్మ సంస్థాపన చేయటం కోసం యుగయుగంలోను నేను అవతరిస్తుంటాను” అని గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు అభయమిచ్చాడు.

కృష్ణావతారము : సంఖ్య

ఈ అభయ ప్రదానాన్ని చెల్లించటంకోసం పరమాత్మ అనంతకోటి అవతారాలు ఎత్తాడు. అయితే వాటిలో మనం పదింటినే ప్రధానంగా గ్రహించి “దశావతారా” లని వ్యవహరిస్తున్నాము.

"మత్స్య కూర్మ వరాహశ్చ, నారసింహశ్చ వామనః ।
రామో రామశ్చ రామశ్చ కృష్ణః కల్కిరేవ చ ॥”

అన్న శ్లోకం ఈ దశావతారాలను క్రమంగా పేర్కొంటున్నది. ఇందులో కృష్ణావతారం తొమ్మిదవది. అంకెలలో తొమ్మిది పూర్ణ సంఖ్య. అలాగే దశావతారాల్లో కృష్ణావతారం పూర్ణావతారం.

కృష్ణశబ్ద నిర్వచనం

బ్రహ్మ వైవర్త పురాణంలో

"బ్రహ్మణో వాచకః కోయ మృకారో నంతవాచకః
శివస్య వాచక పశ్చణ కారో ధర్మవాచకః |