పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిప్రకరణము

27

శాపమియ్యఁగ, బ్రహ్మ - సత్తను మఱచి,
యా పట్ల నే నెవ్వ - రైనది మదికిఁ540
దోఁచక యుండఁగాఁ, - దోయజోద్భవునిఁ
జూచి శుశ్రూష హెచ్చుగఁ జేసి, మ్రొక్కి,
నిలిచి నే నెవ్వరు? - నీ వెవ్వ? రిపుడు
దెలుపవే! సద్గురు-దేవ!’ యటంచు
నేను ప్రార్థింప మ-న్నించి విరించి
తా నందు సద్గురు-త్వమును వహించి,
సరగున నాకు సం-సార రోగంబు
హరియింప నౌషధం-బైన జ్ఞానమును
దేఁటగాఁ దా నుప-దేశంబుఁ జేసి,
హాటకగర్భుఁ డి-ట్లనె 'నోకుమార!550
అరుదుగా శ్రమకారి - యగు క్రియాకాండఁ
గరుణతో బోధించు! - కర్మకారులకు,
నది మాని వైరాగ్య - మందుఁ జిత్తంబుఁ
గుదిరించువారికిఁ - గొంకక నీవు
నేను చెప్పిన జ్ఞాన - నిష్ఠ బోధించి
యానంద మొందించు' మని చెప్పెఁగనుక,
రహి నొప్పు భూతప-రంపరలందు
విహరింపుచుండుదు, - విజ్ఞాన పటిమ
వలనఁ గర్మత్వాది - వాంఛల విడిచి,
యులుకక యూరకే - యుండి నిద్రించు560
వాని, కైవడి దేహ - వాసన మఱచి,
మానసంబును గెల్బి - మతి శాంతిఁ బొంది,