పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిప్రకరణము

19

బాద పద్మములపైఁ-బడి లేవకున్న,
బాదరాయణుఁ డెత్తి-పలికె నిట్లనుచు:
'వినుము పుత్రక!-సూక్ష్మవిజ్ఞానసరణిఁ
గను మాత్మ బుద్ధి వి-కల్పన చేతఁ370
గలుగు విశ్వం, బావి-కల్పనం బణగి
పొలిసినప్పుడు జగం-బులు కానరావు,
అవి గానరాకుండి-నపుడు సంసార
మెవరిదిగాక తా-నెపుడో నశించు,
నది నశించిన దేహ-మం దహంభావ
ముదయింప కణఁగిపో-వుట ముక్తి' యనుచు
వినిపింప, నంతయు-విని శుకయోగి
యనుమానముసు వీడ-కందున్నఁ, జూచి
'వీని సంశయ మిందు-విడువలే' దనుచుఁ
దా నిశ్చయించి వే-దవ్యాసుఁ డనియె:380
'శుక! యింతకన్న హెచ్చుగ నే నెఱుంగ,
నిఁక నీవు చని మిథి-లేశ్వరుండైన
జనకుని నడుగు, నీ-సంశయం బతఁడు
సునిశితార్ధముగఁ దీ-ర్చును, నీ వచటికిఁ
దప్పకపొమ్మంచుఁ దయ దళుకొత్తఁ
జెప్పిన మిథిలేశుఁ-జేరె నా శుకుఁడు;
అప్పుడానంద మ-గ్నాత్ముఁడై లేచి
తెప్పున జనకుఁ డా-ధీరు నీక్షించి,