పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

వాసిష్ఠరామాయణము

సదముల గురుసేవ - సల్పఁగా వలయు;
నది మానిరేని మో-క్షార్హులు గారు.
ఆకాశమందు నై-ల్యాది వర్ణములు
జోకగాఁ గనిపించి - శూన్యంబులైన
కరణిఁ జిద్వ్యోమప్ర-కాశంబునందుఁ
బొరిఁబొరి భూతముల్ - పుట్టి నశించు,
నట్టి మిథ్యారూప - మైన ప్రపంచ
మెట్టి దని మదినూ-హింపంగనీక,60
[1]పటు జాగరతభ్రాంతి - భ్రమలఁ బుట్టించు,
నటువంటి భ్రమకు లో-నై చెడిపోక,
మదిలోనఁ దద్భ్రాంతి - మఱచుటే లెస్స.
అదె చూడు! దృశ్యంబు లన్ని దబ్బఱలు
గానుండి, యజ్ఞాన-కర్మదృక్కులకుఁ
బూని యెప్పుడు నిజం-బుగ గావవచ్చు,
జ్ఞానదృక్కుకుఁ బ్రపం-చము గానరాదు;
మానితబ్రహ్మ మా-త్మకు గోచరించుఁ.
జిత్తవృత్తులు నశిం-చిన జీవతత్త్వ
మత్తఱిఁ జిత్తులో - నణఁకువై పొందు:70
ఇటువంటి సూక్ష్మార్థ-మెఱుఁగ నేరకను
ఘటికులై బహుకర్మ-కంధిలోపలను
పొరలుచుండెడివారు - భూలోకమందుఁ
దఱచైన కల్పశ-తంబులకైన

  1. పటు జాగ్రతన్ భ్రాంతి - వా.