పంచమప్రకరణము
347
వనచరోత్తముఁడైన - వాలినిఁ ద్రుంచి,
యినసూనునకు రాజ్య-మిచ్చి, యంగదుని
యువరాజుగాఁ జేసి - యుంచి, యామీఁదఁ
బవనాత్మజుని భక్తి - భావన మెచ్చి.1230
యతని చేతికి సీత - కానవా లిచ్చి,
ప్రతిభతోఁ బంప, న - ప్పవననందనుఁడు
లవణాబ్ది లంఘించి - లంకలోఁ జొచ్చి
యవనీతనూభవ - నచ్చోటఁ గాంచి,
శ్రీ రామచంద్రుఁ డి-చ్చిన యుంగరంబు
గౌరవంబుగ సీత - కరములం దుంచి,
చెచ్చెర సీత యి-చ్చిన మానికంబు
నచ్చుగాఁ గైకొని - యందుండి కదలి.
వనపాలకుల నొంచి, - వనము మాయించి ,
ఘనశూరుఁడైన య-క్షకుమారు నణఁచి.1240
లంకాధిపతిని ని -ర్లక్ష్యంబు చేసి.
లంకఁ గ్రక్కునఁ గాల్చి, - లవణాబ్ధిఁ గడచి,
రామున కా శిరో -రత్నంబు నిచ్చె;
నా మీఁద రఘువరుఁ - డఖిలవానరులఁ
గూడి తోయధిని మి-క్కుటముగాఁ గట్టి,
పోడిమి లంకకుఁ - బోయి శౌర్యమునఁ
గడఁగి రావణకుంభ- కర్ణాదులైన
చెడుగు రక్కసులఁ గూ-ల్చి విభీషణునకుఁ
బని బూని లంకలోఁ - బట్టంబుఁ గట్టి,
జనకజన్ దోడ్కొని - సౌమిత్రతోడ ,1250