పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమప్రకరణము

347

వనచరోత్తముఁడైన - వాలినిఁ ద్రుంచి,
యినసూనునకు రాజ్య-మిచ్చి, యంగదుని

యువరాజుగాఁ జేసి - యుంచి, యామీఁదఁ
బవనాత్మజుని భక్తి - భావన మెచ్చి.1230

యతని చేతికి సీత - కానవా లిచ్చి,
ప్రతిభతోఁ బంప, న - ప్పవననందనుఁడు

లవణాబ్ది లంఘించి - లంకలోఁ జొచ్చి
యవనీతనూభవ - నచ్చోటఁ గాంచి,

శ్రీ రామచంద్రుఁ డి-చ్చిన యుంగరంబు
గౌరవంబుగ సీత - కరములం దుంచి,

చెచ్చెర సీత యి-చ్చిన మానికంబు
నచ్చుగాఁ గైకొని - యందుండి కదలి.

వనపాలకుల నొంచి, - వనము మాయించి ,
ఘనశూరుఁడైన య-క్షకుమారు నణఁచి.1240

లంకాధిపతిని ని -ర్లక్ష్యంబు చేసి.
లంకఁ గ్రక్కునఁ గాల్చి, - లవణాబ్ధిఁ గడచి,

రామున కా శిరో -రత్నంబు నిచ్చె;
నా మీఁద రఘువరుఁ - డఖిలవానరులఁ

గూడి తోయధిని మి-క్కుటముగాఁ గట్టి,
పోడిమి లంకకుఁ - బోయి శౌర్యమునఁ

గడఁగి రావణకుంభ- కర్ణాదులైన
చెడుగు రక్కసులఁ గూ-ల్చి విభీషణునకుఁ

బని బూని లంకలోఁ - బట్టంబుఁ గట్టి,
జనకజన్ దోడ్కొని - సౌమిత్రతోడ ,1250