346
వాసిష్ట రామాయణము
యా రాముఁ డపుడు వి-శ్వామిత్రు వెంట
సారజ్ఞుఁడైనట్టి - సౌమిత్రితోడ
శరచాపములు పూని - చని యరణ్యమునఁ
దిరుగు తాటకను మ-ర్దించి, పిమ్మటను
నతివేగ మారీచుఁ -డను వానిఁ దఱిమి,
ప్రతిభ దీపింప సు-బాహునిఁ ద్రుంచి,
కరుణతో గాధేయు - క్రతువు రక్షించి,
పరఁగ సహల్య శా-పంబును దీర్చి,1210
గరళకంఠుని కార్ము-కంబు ఖండించి,
సురలు మెచ్చఁగ మహీ- సుతను వరించి,
పరశురాముని బాహు -బలము నణంచి,
ధరణిజతో నయో-ధ్యాపురిఁ జేరి,
మెఅయుచు సీతాస-మేతుఁడై యచట
సురుచిరలీలల - సుఖియింపుచుండె.
మఱి కొన్నినాళ్లకు - మంథరవలన
దురుసుగాఁ గైకకు - దుర్బుద్ధి పొడమ
రామచంద్రుని మహా-రణ్య భూములకుఁ
దా మించి పొమ్మన్న, - దశరథేశ్వరుని1220
యనుమతిఁ గైకొని - యతిశాంతుఁ డగుచు
జనకజా సహితుఁడై - సౌమిత్రి తోడ
నా రాముఁడడవుల - కరుగగా, సీత
నా రావణాసురుఁ - డపహరింపఁగను
శ్రీరాముఁ డచ్చటఁ - జింతించి, పంపఁ
జేరి, సుగ్రీవుతో - స్నేహంబు చేసి,