పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

346

వాసిష్ట రామాయణము


యా రాముఁ డపుడు వి-శ్వామిత్రు వెంట
సారజ్ఞుఁడైనట్టి - సౌమిత్రితోడ

శరచాపములు పూని - చని యరణ్యమునఁ
దిరుగు తాటకను మ-ర్దించి, పిమ్మటను

నతివేగ మారీచుఁ -డను వానిఁ దఱిమి,
ప్రతిభ దీపింప సు-బాహునిఁ ద్రుంచి,

కరుణతో గాధేయు - క్రతువు రక్షించి,
పరఁగ సహల్య శా-పంబును దీర్చి,1210

గరళకంఠుని కార్ము-కంబు ఖండించి,
సురలు మెచ్చఁగ మహీ- సుతను వరించి,

పరశురాముని బాహు -బలము నణంచి,
ధరణిజతో నయో-ధ్యాపురిఁ జేరి,

మెఅయుచు సీతాస-మేతుఁడై యచట
సురుచిరలీలల - సుఖియింపుచుండె.

మఱి కొన్నినాళ్లకు - మంథరవలన
దురుసుగాఁ గైకకు - దుర్బుద్ధి పొడమ

రామచంద్రుని మహా-రణ్య భూములకుఁ
దా మించి పొమ్మన్న, - దశరథేశ్వరుని1220

యనుమతిఁ గైకొని - యతిశాంతుఁ డగుచు
జనకజా సహితుఁడై - సౌమిత్రి తోడ

నా రాముఁడడవుల - కరుగగా, సీత
నా రావణాసురుఁ - డపహరింపఁగను

శ్రీరాముఁ డచ్చటఁ - జింతించి, పంపఁ
జేరి, సుగ్రీవుతో - స్నేహంబు చేసి,