ఈ పుట ఆమోదించబడ్డది
336
వాసిష్ట రామాయణము
'బెలుచ జీవేశ్వర - భేదంబు వేద,
మలరి పల్కుట దేమి? - యానతిం' డనిన
మౌని యిట్లనియె 'రా-మ! తొలుత భేద
మూని చెప్పుకయున్న - నుర్విని జనులు
మొదట నభేద మి-మ్ముగ విచారించి
తుదముట్టఁ జాల, రం-దున దయచేత990
బెట్టుగా జీవేశ - భేదవాక్యములఁ
బుట్టించి యీశ్వర - పూజ గావించి,
తదనుగ్రహమున న-ద్వైతచింతనము
కుదిరికగాఁ జేసి - కొన్నాళ్లకైనఁ
బొసఁగ జీవన్ముక్తి - పొందెద రనుచు
విసువక భేద మా-వేదంబు పలుకుఁ
గావునఁ, బూర్వ-పక్షము నుద్ధరింపఁ
గావలెఁ దొలుత స-త్కర్మ పద్ధతిని
ఎఱిఁగిన యటువలె - నేతివాక్యాను
సరణంబుచేత దూ-షణసేసి విడిచి,1000
యామీఁద సిద్ధాంత-మైన యర్థమును
క్షేమంబుగాఁ బ్రతి-ష్ఠింపఁ గావలయు.
ఒనరఁగా నదియు వే-దోక్తమే గనుక
జననాథ! వేదశా-స్త్రము లివ్విధమునఁ
జెలరేఁగి భేదముల్ - చెప్పు, నవ్వలను
దొలఁగక యుపనిష-త్తులు నిదానముగఁ