పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థ ప్రకరణము

289

వచ్చి సురేంద్రుఁడా , వసుధేశు చెంత
నచ్చెరువుగ నిల్చె, - నాశిఖిధ్వజుఁడు

చూచి యాజిష్ణు న-చ్చోటఁ బూజించి
యీ చందమునను మీ-రిటకు వచ్చుటకు

హేతు?' వేమన నింద్రుఁ - డిట్లని పలికె:
'భూతలాధీశ! నీ - పుణ్యాతిశయము

మెచ్చి రంభాది కా-మినులు నీ పొందు
హెచ్చుగాఁ గోరి, యం-దెదురు చూచెదరు,

సకలభోగమ్ములా - స్వర్గలోకమున
సకలంకమతిని నీ-వనుభవింపుచును, 2050

నచ్చోట నిల్చి కల్పాంతంబుదనక
విచ్చలవిడిగాను - విహరింపువలయుఁ;

గావున నాకలో-కమునకు నీవు
రాపలె ననఁగ నా - రాజేంద్రుఁ డనియె:

'ఇంత మాత్రపుఁ బని - కింద్ర! నీ విటకు
దంత్రీందు నెక్కి రాఁ దగునె నన్ బిల్వ?

నీ వెంతఁ బిల్చిన - నే స్వర్గమునకు
రావలసిన దేమి? - రంభాదిపతుల

పొందు నే నొల్లఁ ద-ద్భోగంబు ----
నందించు నిండి' నే-నంతట నుండి, 2060

యరమర లేక బ్ర-హ్మంబునం దెపుడు
మెఱయుచు నేన ర మింతు, నీ స్వర్గ

భోగంబు నే నొల్లఁ - బొమ్మన్న నింద్రుఁ
డేఁగె మహిపాలుఁ - డిందుండె, నవలఁ