పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

284

వాసిష్ఠరామాయణము

మురిసి నాథుని బహి-ర్ముఖునిఁ జేయుటకు
నరుదుగాఁ దాను సిం-హంబు చందమున 1930

ఘనగిరుల్ ఘూర్ణిల్ల - గర్జించె నపుడు,
వనచరుల్ బెదరి రా-వసుమతీశ్వరుఁడు

చలియింపకున్న నా-శ్చర్యంబు నొంది,
చెలరేఁగి మఱియు గర్జించి గర్జించి,

యలసినప్పటికైన - నవనీశ్వరుండు
వలనొప్ప మేరు ప-ర్వతముచందమునఁ

గదలక మెదల క-క్కడ సత్త్వనిష్ఠ
వదలకున్నటువంటి - వాని నీక్షించి,

యా రమణీమణి - యతని మేల్కొలుప
వేఱె యుపాయంబు - వెదకె నెట్లనిన, 1940

స్థూలాంగమం దుంచి - సూక్ష్మదేహమున
లాలితమతి నవ-లంభించి కొనుచు

ధరణీశు సత్త్వచి-త్తంబులోఁ జేరి,
సరగునఁ జైతన్య - చలన మొందించి,

జగముచందమున నా-కాశమార్గమున
కెగసి భూమికి డిగ్గి - యెప్పటివలెనె

చిలుక పంజరములోఁ - జేరినమాడ్కి
నలరుచు నిజదేహ - మందుఁ దాఁ జేరి,

నిలిచి చూచుచు నుండి - నృపుని చిత్తంబు
చలనంబు నొందగా - సామగానంబు 1950