282
వాసిష్ఠరామాయణము
వరుసగా దాన జీ-వన్ముక్తుఁడైన
పురుషుండు క్రమ్మఱఁ బుట్టుట లేక,
తుదను విదేహము-క్తుండగు: నీవు
పొదువుగా శమదమం-బుల నొంది, సర్వ
శాంతుఁడవై సర్వ-సముఁడవై నిరత
మంతరంగ జ్ఞప్తి-నరయుచు నుండు,
వసుధఁ బ్రాప్తములైన వస్తుజాలములఁ
బొసఁగు నుదాసీన బుద్ధిచే నీవు
ననుభవించునుండు-మచలుండ వగుచు,
అనఘ! నిశ్చలచిత్తు లగు వారి కిలను 1890
దొడరు పునర్జన్మ-దుఃఖసంసార
ముడిగి నశించిపోవుచు నుండుఁగాన,
నీవు చలింపక - నిన్ను నీ విపుడు
భావింపు మనిన భూ-పతి కుంభుఁ జూచి
చలతాచలత్వముల్ సహజముల్ గాను
గలుగు, నారెంటి నే గతిని వారింతు?
నావిధమెఱిఁగింపు మనినఁ గుంభుండు
భూవరుఁ జూచి యో-పుణ్యాత్మ' వినుము!
పొగడొందు సలిల మం భోనిధియైన
పగిదిఁ బ్రపంచమే - బ్రహ్మమై యుండుఁ . 1900
గావున నీ వీయ-ఖండ లక్ష్యమున
భావింపు మా పర బ్రహ్మ మే ననుచు,
లలి నందుఁ జలతాచ-లత్వంబు లణఁగు,
బొలుచు రజ్జువు నందుఁ - బుట్టిన సర్ప