పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థ ప్రకరణము

281

నజ్ఞాన మణఁగిన-నాత్మానుభవము
ప్రజ్ఞానమై నిండి-పండు, నంతటికి

సరస సద్గురు కటా-క్షము గల్గినట్టి
నరునకు సచ్చిదా-నందసౌఖ్యంబు 1860

దొరకు, చిత్త మణుంగుఁ -దుర్యసమాధి
యిరవగు చుండు, నీ-వీనాఁటి కట్టి

పరమ విజ్ఞాన సం-పన్నుండ వగుచుఁ
బొరిని జీవన్ముక్తిఁ బొందితి' వనిన

వసుధీశుఁ డనియె-నో వరగురుస్వామి!
వసుమతిమీఁద జీ-వన్ముక్తుఁడైన

నరుని చిత్తంబు వి-నాశ మొందినను
పరఁగఁ జిత్తములేక బ్రతికి యతండు

దరణిపై నుండు వి-ధం బెట్టు లనిన
గురుతర కరుణ నా కుంభుఁ డిట్లనియె; 1870

ఓ రాజ! విను పున-రుత్పత్తి వాస
నారూఢమై చిత్త-మజ్ఞుని యందుఁ

జలన మొందుచునుండు-సద్గురు కరుణ
వలన ముక్తుండైన-వరయోగియందుఁ

దరళిత మాని స-త్తా మాత్ర మగుచు
నిరుపమ చిత్తంబు-నిలిచియుండుటను

రహి నొప్పు సంకల్ప-రహిత మైనట్టి
సహజ కర్మంబున-సక్తుఁడై యతఁడు

గావింపుచున్న త-త్కర్మ మాయోగ
పావక ముఖమందు-భస్మమై పోవు. 1880