చతుర్థ ప్రకరణము
279
నామాట నిజముగా - నమ్ము! న' మ్మనిన
భూమీశ్వరుండు కుం-భుని పాదములకు 1810
మ్రొక్కి యి ట్లనియె నో-మునికులోత్తంస !
మిక్కుటంబైనట్టి మీబోధవలన
నెఱిఁగితిఁ దత్త్వం బ-దెట్లన్న వినుఁడు!
పరమాత్మయం దీ ప్ర-పంచ జాలంబు
చెలఁగెడి మరుమరీ-చికయందు జలము
గలరీతిఁ దోఁచిన -కైవడిగాను,
పరఁగ రజ్జువునందుఁ-బా మున్నరీతి,
నరయ స్వప్నపాయ-మగు ప్రపంచంబు
కర్త లేమినిఁ జేసి కలుగుట లేదు,
పూర్తిగా నుండుట-పోవుట లేదు, 1820
ఆదిమధ్యాంతంబు-లరయంగరాని
వేదాంత సారాత్మ-విమలమై నిండి,
ఇది యది యని చెప్ప- హేతువు లేక,
తుద మొదల్ గనరాక- తుర్యమై యున్న
యదియె సత్తామాత్ర మదియె నే నైతి;
నిది మిథ్య యనఁ గూడ-దీ చిత్సుఖంబు
మీ కటాక్షమున న-మేయానుభవము
నీకాలమునకు నే-నెఱిఁగితిఁ, దనువు
నే ననెడి యహంత- నీరసం బయ్యె;
నే నను తెలివిలో-నే యున్న గుట్టుఁ 1830
దెలిసితి, మీ యుప-దేశంబు నాకు
ఫలియించె' నని మ్రొక్కి పాషాణమటులఁ