ఈ పుట ఆమోదించబడ్డది
చతుర్ధప్రకరణము
267
యది పురుషార్థ స-మాప్తి తదన్య
మిది యది యనఁగ లే-దిరవు కొన్నట్టి
యజ్ఞానవైరి నీ-కగపడినపుడు
ప్రజ్ఞతో వానిఁ జం-పక వీడినందు 1530
వల్ల నీకిన్ని దుర్-వ్యధలు ప్రాప్తించె;
నల్లనాఁ డజ్ఞత - నణఁచియుండినను
ఎనలేని దుర్దశ - లేల నిన్ బొందు?
ననఘ! చిదానంద - మబ్బి నీజడత
విడిపించు' ననుచు భూ-విభున కేరీతిఁ
గడఁగి చింతామణి - కథ వినిపించి.
యాకుంభరూపిణి-యైన చూడాల
ప్రాకట కరుణతోఁ - బలికెఁ గ్రమ్మఱను:
'ఓ నరనాథ యిం-కొక యితిహాస
మేను చెప్పెద నది - యె ట్లన్న వినుము! 1540
గజోపాఖ్యానము
అలఘు వింధ్యారణ్య-మందొక్క గజము
గలదు హస్తిపుఁడు త-క్కక దానిఁ బొంచి
పట్టి గొలుసు దాని - పదమున నంటఁ
జుట్టి వృక్షమున క-చ్చుగఁ గట్టివేసి,
ఆ దాని ముందరి - తాఁటిమ్రానెక్కఁ
గా, దంతి దంత యు-గంబుతోఁ గాలి
గొలుసు గ్రక్కున నీడ్చి-కొని ఘీంకరింప,
నళికి హస్తిపుఁడు తా-నా మ్రాని మీఁద