ఈ పుట ఆమోదించబడ్డది
226
వాసిష్ఠరామాయణము
నిరతంబు తనలోనె - నిండించు కొనుచుఁ
బొరి నాకసంబు గా-డ్పును నాఁచి కొనిన
పగిది నాకాశాది - పంచ భూతముల
నగణిత బహుపద్మ - జాండ కోటులను
ఆ మహాశిలలోని - కాకర్షణంబు
వేమఱు సేయుచున్ - విడుచుచునుండుఁ,
దా నరంధ్రయు నభే-ద్యం బగుచుండు,
నేనాఁడుఁ గనినఁదా-నేకమై యుండు,
జలజగదాశంఖ - చక్రాది చిహ్న
ములతోడఁ బరిపూర్ణ-ముగ నిండియుండుఁ, 570
దెలివియై తా సుషు-ప్తినిఁ బొందుచుండు.
నలఘు పరబ్రహ్మ - మదియే యటంచు
నగణితప్రజ్ఞతో - నా రాఘవుండు
విగతసంశయుఁడై, వి-వేకియై నిజముఁ
జెప్పిన విని యావ సిష్ఠుండు లోన
నుప్పొంగి, హర్షాశు - లుబ్బుచుండఁగను
పరమసంతోష ని-ర్భరమానసుఁడును
గరమొప్పఁ బులకిత - కాముండు నగుచు,
గద్గద కంఠుఁడై - కరములు మొగిచి,
చిద్గగనరహస్య - శిల కర్థ మిట్లు 580
చెప్పిన రాము నీ-క్షించి, తా మెచ్చి,
యప్పు డి ట్లనియె 'మా-యప్ప! శ్రీరామ!