పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

వాసిష్ఠరామాయణము

నిరతంబు తనలోనె - నిండించు కొనుచుఁ
బొరి నాకసంబు గా-డ్పును నాఁచి కొనిన

పగిది నాకాశాది - పంచ భూతముల
నగణిత బహుపద్మ - జాండ కోటులను

ఆ మహాశిలలోని - కాకర్షణంబు
వేమఱు సేయుచున్ - విడుచుచునుండుఁ,

దా నరంధ్రయు నభే-ద్యం బగుచుండు,
నేనాఁడుఁ గనినఁదా-నేకమై యుండు,

జలజగదాశంఖ - చక్రాది చిహ్న
ములతోడఁ బరిపూర్ణ-ముగ నిండియుండుఁ, 570

దెలివియై తా సుషు-ప్తినిఁ బొందుచుండు.
నలఘు పరబ్రహ్మ - మదియే యటంచు

నగణితప్రజ్ఞతో - నా రాఘవుండు
విగతసంశయుఁడై, వి-వేకియై నిజముఁ

జెప్పిన విని యావ సిష్ఠుండు లోన
నుప్పొంగి, హర్షాశు - లుబ్బుచుండఁగను

పరమసంతోష ని-ర్భరమానసుఁడును
గరమొప్పఁ బులకిత - కాముండు నగుచు,

గద్గద కంఠుఁడై - కరములు మొగిచి,
చిద్గగనరహస్య - శిల కర్థ మిట్లు 580

చెప్పిన రాము నీ-క్షించి, తా మెచ్చి,
యప్పు డి ట్లనియె 'మా-యప్ప! శ్రీరామ!