ఈ పుట ఆమోదించబడ్డది
212
వాసిష్ఠరామాయణము
గుఱియైన కేవల - కుంభకం బనుచు
వరయోగు లగువారు - వచియింతు రిలను,
మఱియుఁ బ్రాణము పొద-మక యపానంబు
నఱిముఱి నణఁగంగ - నపు డెద్ది ప్రబలి
సత్తుగా నిలుచుఁ దద్ - జాసస్వరూప
ముత్తమోత్తమముగా - నూహించి, దాని 240
యం దైక్యమై, నిశ్చ-లానందపదము
నొంది, యందుఁ జలింప-కుండు మనంబు.
అట్టి ప్రాణసమాధి - యం దంటి, సతత
మట్టిట్టు చనక చి-దాకాశమందె
శాంతిచేఁ జిత్త వి-శ్రాంతినిఁ బొంది,
యాంతర్యసౌఖ్యంబు - ననుభవింపుచును
వసుధ భూతము, భావి - వర్తమానముల
విసువక కర్తనై - వీక్షింపుచుందు;
నలఘు సుఖంబులం - దాపదలందుఁ
గలుగు సౌఖ్యమును దు:-ఖమును బొందకను 250
సరవి నెన్నఁగ సర్వ - సముఁడనై మఱియు
వరసత్వభావభా-వనుఁడనై యెపుడు
చిరజీవినై ప్రకా శించి యిం దుందుఁ
బరమ మునీంద్ర! నా - బ్రతు కిట్టి దనిన
విని భుశుండునిఁ జూచి - 'విమలాత్మ! నీవు
ఘనకాలవేదవి - గాంభీర్యమతివి