ఈ పుట ఆమోదించబడ్డది
208
వాసిష్ఠరామాయణము
అరయఁగాఁ బెక్కేఁడు - లవనీతలంబు
నరశూన్యమై యుండె - నానాముఖముల,
మురు వొప్ప వన శైల-ములు భస్మమయ్యె,
నరుదుగా సూర్య చం-ద్రాగ్ను లణంగె.
మూఁడు లోకములను - ముంచెఁ దోయంబు,
క్రోడమై హరి మహా - క్రూరుఁ డైనట్టి
హేమాక్షు నణఁగించి - యిల నుద్ధరించె,
నీ మహామహిమంబు - నేను బాల్యమున 150
గనుఁగొనుచుంటిఁద-క్కక, యిదిగాక
గొనకొని మున్నేడ-గురు వసిష్ఠులను,
చెలువొప్ప నేను వీక్షింపుచుండితిని,
సొలయ కష్టమ పసి-ష్ఠుఁడవైన నిన్నుఁ
గనుగొంటినొకమాఱు - గగనంబునందుఁ,
బనిఁబూని యొకమాఱు - పవనంబు నందు,
ననువొంద నొక్క మా -ఱనలంబు నందు
నొనరంగ నొక్కమా-ఱుదకంబు నందు,
నొకమాఱు ధరణియం.- దొకమాఱు మఱియుఁ
బ్రకటమై తగు మహా - పర్వతమందు. 160
మొనన్ మహత్తత్త్వ - మున నొకమాఱు,
ననఘాత్ముఁడగు బ్రహ్మ - యం దొకమాఱు,
నురుతరప్రజ్ఞతో - సుద్భవం బొంది,
చరియింపుచుందువు - సకలలోకముల,