పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

208

వాసిష్ఠరామాయణము

అరయఁగాఁ బెక్కేఁడు - లవనీతలంబు
నరశూన్యమై యుండె - నానాముఖముల,

మురు వొప్ప వన శైల-ములు భస్మమయ్యె,
నరుదుగా సూర్య చం-ద్రాగ్ను లణంగె.

మూఁడు లోకములను - ముంచెఁ దోయంబు,
క్రోడమై హరి మహా - క్రూరుఁ డైనట్టి

హేమాక్షు నణఁగించి - యిల నుద్ధరించె,
నీ మహామహిమంబు - నేను బాల్యమున 150

గనుఁగొనుచుంటిఁద-క్కక, యిదిగాక
గొనకొని మున్నేడ-గురు వసిష్ఠులను,

చెలువొప్ప నేను వీక్షింపుచుండితిని,
సొలయ కష్టమ పసి-ష్ఠుఁడవైన నిన్నుఁ

గనుగొంటినొకమాఱు - గగనంబునందుఁ,
బనిఁబూని యొకమాఱు - పవనంబు నందు,

ననువొంద నొక్క మా -ఱనలంబు నందు
నొనరంగ నొక్కమా-ఱుదకంబు నందు,

నొకమాఱు ధరణియం.- దొకమాఱు మఱియుఁ
బ్రకటమై తగు మహా - పర్వతమందు. 160

మొనన్ మహత్తత్త్వ - మున నొకమాఱు,
ననఘాత్ముఁడగు బ్రహ్మ - యం దొకమాఱు,

నురుతరప్రజ్ఞతో - సుద్భవం బొంది,
చరియింపుచుందువు - సకలలోకముల,