పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయ ప్రకరణము

185

దాఁ బ్రయత్నముఁ జేసి-తనువు పైకెత్తఁ
గాఁ బ్రయా సై తోఁపఁ-గా, దాని విడిచి,

అతఁ డంతఁ బుర్యష్ట - కాంగంబుతోడఁ
బ్రతిభ మీఱఁగ లేచి, - పవనుఁడై సూర్య

నారాయణునిఁ జేరి -ననుఁ బింగళాఖ్య
నారూఢుఁ డగు దూత - నబ్జబాంధవుఁడు

పనుపఁగాఁ జని నేలఁ-బంకమధ్యమున
మునిఁగి యున్నట్టి య-మ్ముని శరీరమును

గుదురుగాఁ బెకలించి - కొని చని చాల
ముదముతో సూర్యుని - ముందర నిడఁగ,1380

నాదిత్యుఁ డా వీత- హవ్వు నీక్షించి,
'ఏ దేహమున నీవు- నిలువు' మటంచు

నానతిచ్చిన వీత - హవ్యుఁ డా మేను
నూని ప్రవేశించి, - యున్నతుఁ డగుచు

ముదమంది సంగని-ర్ముక్తుఁడై,మమత
వదలించి విడిచి. జీ -వన్ముక్తుఁ డగుచు

స్వచ్ఛ మనస్కుఁడై, - సర్వస్థలముల
నిచ్ఛా విహరుఁడై - యెఱుక నేమఱక,

యనఘుఁడై దశసహ - స్రాబ్ధముల్ గడపి,
కినిసి విదేహము-క్తినిఁ బొందఁ దలఁచి,1390

లలితుఁ డేకాంత - స్థలమందుఁ జేరి,
చెలఁగి శుద్ధాసనా-సీనుఁడై యుండి,

తనలోనె తాను వి- తర్కించి, రాగ
మును, ద్వేషమును జూచి - మొనసి యిట్లనియె: