తృతీయ ప్రకరణము
185
దాఁ బ్రయత్నముఁ జేసి-తనువు పైకెత్తఁ
గాఁ బ్రయా సై తోఁపఁ-గా, దాని విడిచి,
అతఁ డంతఁ బుర్యష్ట - కాంగంబుతోడఁ
బ్రతిభ మీఱఁగ లేచి, - పవనుఁడై సూర్య
నారాయణునిఁ జేరి -ననుఁ బింగళాఖ్య
నారూఢుఁ డగు దూత - నబ్జబాంధవుఁడు
పనుపఁగాఁ జని నేలఁ-బంకమధ్యమున
మునిఁగి యున్నట్టి య-మ్ముని శరీరమును
గుదురుగాఁ బెకలించి - కొని చని చాల
ముదముతో సూర్యుని - ముందర నిడఁగ,1380
నాదిత్యుఁ డా వీత- హవ్వు నీక్షించి,
'ఏ దేహమున నీవు- నిలువు' మటంచు
నానతిచ్చిన వీత - హవ్యుఁ డా మేను
నూని ప్రవేశించి, - యున్నతుఁ డగుచు
ముదమంది సంగని-ర్ముక్తుఁడై,మమత
వదలించి విడిచి. జీ -వన్ముక్తుఁ డగుచు
స్వచ్ఛ మనస్కుఁడై, - సర్వస్థలముల
నిచ్ఛా విహరుఁడై - యెఱుక నేమఱక,
యనఘుఁడై దశసహ - స్రాబ్ధముల్ గడపి,
కినిసి విదేహము-క్తినిఁ బొందఁ దలఁచి,1390
లలితుఁ డేకాంత - స్థలమందుఁ జేరి,
చెలఁగి శుద్ధాసనా-సీనుఁడై యుండి,
తనలోనె తాను వి- తర్కించి, రాగ
మును, ద్వేషమును జూచి - మొనసి యిట్లనియె: