పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయప్రకరణము

171

భయము నొందుచు - వారిపంథలఁ బోక,
జయ మొంద నిలుచు భా-స్వరవస్తువందు

మదిని నిల్పు, మహంత - మమత ని న్విడుచుఁ;
జెదరక యుపశాంతిఁ -జెందుచు, జనులఁ

బాలింపు చుండు ని-ర్భరముగాఁ, జింత
యే?' లని చెప్పి మ- నీశ్వరుం డరిగె.

సురఘుఁ డావల నతి - సూక్ష్మభావమున
నెఱుక తా ననుచు. - దేహేంద్రియవిషయ

తతి జడం బగునది-తానుగా ననుచు,
నతిశయ బ్రహ్మరు - ద్రాది దేహముల 1050

యం దనేకంబు లై-నట్టి రత్నముల
యందొక సూత్ర ము న్నట్టి చందమున

వెలుఁగుచుండు చిదాత్మ - వేఱుగా దనుచుఁ
దలఁచి యన్నిటికినిఁ దా పరుం డగుచు.

నల సుఖ దుఃఖ ద్వ-యాతీతుఁ డగుచు,
నెలమిఁ గుటుంబియై-యే కాకి యగుచు,

నెఱి దయాకరుఁడు నై-నిర్దయుం డగుచుఁ,
జిరతరంబుగ యోగ - సిద్ధినిఁ బొంది,

తొడరి నిరాసక్తి-తో రాజ్యపదము
నుడుగక పాలింపు - చుండఁగా, నటకుఁ 1060

బరిఘుం డనెడు మహీ - పతి రాఁగ, సురఘుఁ
డరుదుగాఁ బూజించె - సా పరిఘుండు

అతనిచే సత్కృతుఁడై యటమీఁద
హితము రెట్టింపఁగా - ని ట్లని పలికె: