తృతీయప్రకరణము
171
భయము నొందుచు - వారిపంథలఁ బోక,
జయ మొంద నిలుచు భా-స్వరవస్తువందు
మదిని నిల్పు, మహంత - మమత ని న్విడుచుఁ;
జెదరక యుపశాంతిఁ -జెందుచు, జనులఁ
బాలింపు చుండు ని-ర్భరముగాఁ, జింత
యే?' లని చెప్పి మ- నీశ్వరుం డరిగె.
సురఘుఁ డావల నతి - సూక్ష్మభావమున
నెఱుక తా ననుచు. - దేహేంద్రియవిషయ
తతి జడం బగునది-తానుగా ననుచు,
నతిశయ బ్రహ్మరు - ద్రాది దేహముల 1050
యం దనేకంబు లై-నట్టి రత్నముల
యందొక సూత్ర ము న్నట్టి చందమున
వెలుఁగుచుండు చిదాత్మ - వేఱుగా దనుచుఁ
దలఁచి యన్నిటికినిఁ దా పరుం డగుచు.
నల సుఖ దుఃఖ ద్వ-యాతీతుఁ డగుచు,
నెలమిఁ గుటుంబియై-యే కాకి యగుచు,
నెఱి దయాకరుఁడు నై-నిర్దయుం డగుచుఁ,
జిరతరంబుగ యోగ - సిద్ధినిఁ బొంది,
తొడరి నిరాసక్తి-తో రాజ్యపదము
నుడుగక పాలింపు - చుండఁగా, నటకుఁ 1060
బరిఘుం డనెడు మహీ - పతి రాఁగ, సురఘుఁ
డరుదుగాఁ బూజించె - సా పరిఘుండు
అతనిచే సత్కృతుఁడై యటమీఁద
హితము రెట్టింపఁగా - ని ట్లని పలికె: