166
వాసిష్ఠరామాయణము
వినిన మానవు లతి - విమలాత్ము లగుచు
ఘనముక్తి మార్గంబుఁ-గని సుఖింపుదురు.
ధరణీశ! నీవు ను-ద్దాలక మౌని
కరణి నిన్నే నీవు - గనుచు, విశ్రాంతి
నొంది, యుత్తమమైన యున్నతపదము
నందు వర్తింపుచు నానంద మొందు'
మనిన మౌనికి మ్రొక్కి, యా రాఘవుండు
మనమున నూహించి - మరల నిట్లనియె:
మునినాథ సంసార - మున నుండి యొక్కఁ
వసఘు(జై సుజ్ఞాని - యగుచు విశ్రాంతిః
బొంది సంసార మొప్పుగఁ జేయుచుండు,
మందతన్ విడచి స - మాధిఁ గావించు;
నటుగాక మఱి యొక్కఁ డారణ్యములను
పటువిరాగమునఁ బ్ర పంచధర్మముల
మణచి యే వేళ సమాధిఁ గావించు:
నకడు నయ్యిచఱి-యం దధికుండు
ఎవఁ? డన్న నవ్వి ము-నీంద్రుఁ డిట్లనియె:
'అవనీశ! చెప్పెద - నా రెండు గతుల
విను మెట్టు లనిన వివేకాత్ముఁ డగుచు
గొన మొదల్ గని, సర్వ గుణ సముహంబు
జడమంచు, నాత్మ య బడమంచుఁ దెలిసి,
యడరఁ దదాత్మ తా నని నిశ్చయించి,
యాంతరంగిక దృష్టి ననవరతంబు
శాంతుఁడై చిత్త విశ్రాంతి వహించి,