పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

వాసిష్ఠరామాయణము

వినిన మానవు లతి - విమలాత్ము లగుచు
ఘనముక్తి మార్గంబుఁ-గని సుఖింపుదురు.

ధరణీశ! నీవు ను-ద్దాలక మౌని
కరణి నిన్నే నీవు - గనుచు, విశ్రాంతి

నొంది, యుత్తమమైన యున్నతపదము
నందు వర్తింపుచు నానంద మొందు'

మనిన మౌనికి మ్రొక్కి, యా రాఘవుండు
మనమున నూహించి - మరల నిట్లనియె:

మునినాథ సంసార - మున నుండి యొక్కఁ
వసఘు(జై సుజ్ఞాని - యగుచు విశ్రాంతిః

బొంది సంసార మొప్పుగఁ జేయుచుండు,
మందతన్ విడచి స - మాధిఁ గావించు;

నటుగాక మఱి యొక్కఁ డారణ్యములను
పటువిరాగమునఁ బ్ర పంచధర్మముల

మణచి యే వేళ సమాధిఁ గావించు:
నకడు నయ్యిచఱి-యం దధికుండు

ఎవఁ? డన్న నవ్వి ము-నీంద్రుఁ డిట్లనియె:
'అవనీశ! చెప్పెద - నా రెండు గతుల

విను మెట్టు లనిన వివేకాత్ముఁ డగుచు
గొన మొదల్ గని, సర్వ గుణ సముహంబు

జడమంచు, నాత్మ య బడమంచుఁ దెలిసి,
యడరఁ దదాత్మ తా నని నిశ్చయించి,

యాంతరంగిక దృష్టి ననవరతంబు
శాంతుఁడై చిత్త విశ్రాంతి వహించి,