పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

వాసిష్ఠరామాయణము

నగమందుఁ జేరి, నా - నాత్మ విభ్రాంతి
తెగువగా విడిచి, య-దే విచారముగఁ

దప మాచరించి త-త్త్వజ్ఞాని యగుచు
నిపుణతచేఁ బొందె - నిర్వాణపదము.

శ్రీహరి ధ్యానంబు - చెడక భక్తులను
మోహాబ్ది దాఁటించి - ముక్తిఁ బొందించు'

నని, గాధివృత్తాంత - మా వసిష్ఠుండు
మనము రంజిలఁ జెప్పి - మరల నిట్లనియె:

'ధరణీశ ! రామ! చి-త్తజయౌషధంబు
సరసమై సంసార - జాడ్యంబు నణఁచు: 650

వేరె వెరవుచేత - విడువ దారోగ,
మారయ వృద్దియౌ - నటుగాన, నందు

అంటక చిత్తంబు - నణఁచునుపాయ
మొంటిగా నూహింపు - చుండఁగావలయు;

మెలపుగాఁ గ్రిందటి - మీఁదటి కాల
ములఁ గల్గు సుఖదుఃఖ-ములఁ దలంపకయ

మానుచుఁ, దగ వర్త-మాన కాలమునఁ
బూనిక ననుభవం-బునకు వచ్చినది

యనుభవింపుచు బాహ్య- మందు వర్తింపు
చును, నిజాంతర్య భా-సుర లక్ష్యమందుఁ 660

బొంది సూక్ష్మంబైన - బుద్ధియం దమరఁ
జెందినఁ జిత్తంబు - ఉత్పద మొందుఁ:

గ్రమముగా భోగ సం-కల్పముల్ విడిచి,
మమతాహముల మాని, - మది చల్లనైనఁ