154
వాసిష్ఠరామాయణము
నగమందుఁ జేరి, నా - నాత్మ విభ్రాంతి
తెగువగా విడిచి, య-దే విచారముగఁ
దప మాచరించి త-త్త్వజ్ఞాని యగుచు
నిపుణతచేఁ బొందె - నిర్వాణపదము.
శ్రీహరి ధ్యానంబు - చెడక భక్తులను
మోహాబ్ది దాఁటించి - ముక్తిఁ బొందించు'
నని, గాధివృత్తాంత - మా వసిష్ఠుండు
మనము రంజిలఁ జెప్పి - మరల నిట్లనియె:
'ధరణీశ ! రామ! చి-త్తజయౌషధంబు
సరసమై సంసార - జాడ్యంబు నణఁచు: 650
వేరె వెరవుచేత - విడువ దారోగ,
మారయ వృద్దియౌ - నటుగాన, నందు
అంటక చిత్తంబు - నణఁచునుపాయ
మొంటిగా నూహింపు - చుండఁగావలయు;
మెలపుగాఁ గ్రిందటి - మీఁదటి కాల
ములఁ గల్గు సుఖదుఃఖ-ములఁ దలంపకయ
మానుచుఁ, దగ వర్త-మాన కాలమునఁ
బూనిక ననుభవం-బునకు వచ్చినది
యనుభవింపుచు బాహ్య- మందు వర్తింపు
చును, నిజాంతర్య భా-సుర లక్ష్యమందుఁ 660
బొంది సూక్ష్మంబైన - బుద్ధియం దమరఁ
జెందినఁ జిత్తంబు - ఉత్పద మొందుఁ:
గ్రమముగా భోగ సం-కల్పముల్ విడిచి,
మమతాహముల మాని, - మది చల్లనైనఁ