పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

వాసిష్ఠరామాయణము

పదరి నా కిపుడు శా - పం బిత్తు ననిన
నెదిరించి ప్రతిశాప - మిచ్చెద నీకు,

విను నేను మును పది - వేవురు రుద్రు
లను, లక్షవిష్ణువు - లను, బద్మజాండ 70

కోటులఁ బట్టి మ్రిం - గుదుఁగాన, మిమ్ముఁ
బోఁటి విప్రులు నాకు - భోజ్యముల్‌ గారె!

ఇంత తపముఁ జేస్‌ - యీనాఁటికైనఁ
శాంతిఁ బొందవు ము - నీశ్వర! మదిలోనఁ,

గుదురు చున్నటువంటి - క్రోదంబు నణఁపు,
మది యెట్టు లనిన నె - య్యంబుతో వినుము!

సారిది చిత్తము పూరు - సుండు, తత్కృతము
పొరిబుద్ధి యనఁబడు, - బుద్ధికృతంబు

నల యహంకారమై - యభిమతకృత్య
ముల నొనరించు ని - మ్ముగ నటు గనుక, 80

సంతతంబును జిత్త - శాంతే సమస్త
శాంతి యటంచు నా - శమనుండు పలుక,

విని భృగుముని చాల - విన్ననై, యమునిఁ
గని యిట్టు లనియె ' ని - క్కడ శుక్రుఁ డుండి

తను విందుఁ బడవైచి - తర్లినచంద
మును నాకుఁ దెల్పు' మి - మ్ముగ నన్న యముఁడు

తా నిట్టు లనియె 'నో - తాపసప్రవర!
నీవందమం డిందు - నిలిచి శుశ్రూష

సేయు చుండఁగ, మీరు - చిరకాల మీదేట
మాయను గెలిచి వ - మాధి యందున్న 90