పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిప్రకరణము

67

వెఱచుచున్నటువంటి - వేల గురుండు
'సరసాత్మ యిది ప్రపం- చ పిశాచ మనుచు

'భయము నొందకు, మీ ప్ర-పంచంబు బ్రహ్మ
మయ'మని చెప్పఁగా, " మది భీతి విడిచి1470

యరసి చిత్తార్చకుఁ - డానంద మొందు
భరణి నీ కిఁక, నొక్క - కథ వినిపింతు.

ఇందుపుత్రోపాఖ్యానము



అది యెట్లనిన నిందుఁ - డను భూసురుండు
కదలక సతితోడఁ - గైలాసమందుఁ

బరమేశుఁ గూర్చి త-పముఁ జేసి శివుని
వరమునఁ బదిమంది - వరపుత్రకులను

గాంచి, కొన్నాళ్లుండి, - కాలవేగమునఁ
బంచత్వమునఁ బొంది - పడిపోవ, నతని

సతి యగ్నిలోఁ జొచ్చి - సమయఁగా, వారి
సుతు లందఱును జూచి - శోకించి, తాము1480

సేయఁగాఁదగు క్రియల్ - చేసి, యా మీఁద
నాయగ్రజుడుఁ దమ్ము - లందఱిఁజూచి

తల్లినిఁ దండ్రినిఁ - దలఁచి పేర్కొనుచుఁ
దల్లడింపుచు నేడ్చు - తమ్ములఁ బిలిచి

'యేల యేడ్చెదరు? మీ - రెంత యేడ్చినను
జాలిచే జనకుండు - జనని క్రమ్మఱను

వచ్చి మీశోకంబు - వారింపఁ గలరె?
ఇచ్చట వగవక - యేమైన వరము

లఱలేక మీరు న-న్నడుగుఁ డటంచుఁ
గరుణ మీఱఁగఁ బల్కఁ-గాఁ దమ్ములనిరి:1490