పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు


                                                                                                                  20

    మా అమ్మగారూ,మా నాన్నగారూ అదితికశ్యపులు!మా నాన్నగారి పేరు వినాయకరావుగారు.మా అమ్మగారి పేరు వెంకటరామమ్మ.మా అమ్మ మా నాన్న రెండవభార్య అని ఎవ్వరూ అనుకోరు.మా తలిదండ్రులకు నేనే ప్రాణం, నేనే బ్రతుకు. మా అక్క చిన్నతనంలో పోవడంవల్ల అప్పటికి ఆరేళ్ళ బాలికనైన నన్ను తీసుకవచ్చి,ఏడుస్తూ చివికిపోతూ మదరాసులో కాపురం పెట్టారు.మేము వచ్చిన రెండేళ్ళకు మైలాపురంలో అళ్వారు పేటలో పిటాపురంవారి'దేన్మోర్ హౌస్ 'స్థలాల్లో ఒక అందమైన మేడ కొన్నారు మా నాన్నగారు.
    
    సంగీతానికి ఒక మేష్టరు; ఇంగ్లీషు,లెక్కలు,ఫిజిక్సు,కేమిష్టరీ మొదలయిన వాటికి ఒక బి ఏ.; తెలుగు,సంవత్సరం, చరిత్ర,భూగోళంకు ఒక తెలుగు సంవత్సరం ఎం.ఏ.గారు-నాకు ముగ్గురుపాద్యాయులు.నా ఇష్టం వస్తే చదివేదాన్ని.లేకపోతే మానేసేదాన్ని.మా భవనంలో నేనే రాణిని.

    మా నాన్నగారికి అరవై రెండేళ్ళు వచ్చాయి.మా అమ్మకు నలభై మూడు.అయినా వాళ్ళిద్దరూ జీవికా జీవుల్లాగే ఉంటారు.మా నాన్నగారు కొంచెం బొద్దుమనిషి అయినా అట్టే అంత ముసలివానిలా ఉండరు.కాని,చిన్నతనంలో ఉన్న శక్తి అవీ లేవంటూ,ఏదో మూల్గుతూనే ఉంటారు.డాక్టరు వెంకటప్పయ్యగారు వారానికి మూడురోజులు మా ఇంటికి రావలసిందే.

    మా అమ్మగారు నలభై మూడేళ్లకే తల నెరిసిపోయి,పండులా అయిపోయింది.రహస్యంగా నాకు తెలియకుండా ఎంత ఏడ్చేదో!అందు కోసమే ఆవిడ కళ్ళకు ఎప్పుడూ జబ్బులే.ఎప్పుడూ కళ్ళ వైద్యమే!కళ్ళాస్పత్రి కోమన్ నాయరుగారు ఆమెకు ఎప్పుడూ ఏదో వైద్యం చేస్తూనే ఉంటారు.

    మా అక్క కోసం మా అమ్మ ఏడ్వని రోజులేదు.ఎవరైనా చుట్టాలు రావడం మా కందరికీ భయం.ఏ పండుగ వచ్చినా భయమే!నన్ను చూచి కళ్ళు తుడుచుకొని వెడనవ్వు నవ్వుతుంది.ఎందుకే అమ్మ ఆ కళ్ళనీళ్ళు అని అంటే తన కంటిలో ఏదోనలక పడిందంటుంది,అమ్మా మళ్ళీ ఏడుస్తున్నావూఅని నేనంటే ఛా! నేనేడ్చానా నాన్నా !నువ్వు వట్టి వెఱ్ఱి తల్లివి నాన్నా !నీకు అస్తమానం నా కళ్ళల్లో నీళ్ళే కనబడతాయిఅని అంటుంది.
  
    మా అమ్మా మా నాన్నా దుఃఖంచూసి,మా అక్క కోసం అంతా ఏడుస్తారు.ఆవిడ ఎంత మంచిదో అని అనుకుంటాను.మా అక్క పేరు శకుంతల.మా అక్క నాకు అంత జ్ఞాపకం లేకపోయినా మా అక్కను గురించి అన్ని కబురులు వినడంచేత,మా అక్కను చూచినట్లే ఉంటుంది నాకు.

    మా పినతండ్రి పినపాపారావుగా రున్నారు. వారు అప్పుడప్పుడు సకుటుంబంగా మదరాసు వచ్చి మా దగ్గిర ఓ పదిహేనురోజు లుంటూ ఉంటారు.మా పినతండ్రి అంటే మా నాన్నగారి పెదతండ్రికొడుకు.మా పాపారావు