పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కలశ జనితామృతధార లైన ఊరువులలో కానీ, సముద్రమీనమూర్తులైన నా జంఘులలో కాని, మోహనం కాని పొంకమే లేదు.
        
                                                                                                                        11

    బి. ఏ. తెలుగు ఆనర్సు మొదటి శ్రేణిలో నెగ్గిన మదరాసు యూనేవర్సిటీ పాండిత్యము నా సౌందర్యమును నేను మాత్రం వర్ణించుకొనిటందుకు పనికివచ్చినది. ఆ రోజున ఇదంతా రాసుకొని చింపివేసుకొన్నాను. ఆ వెర్రితనమంతా నాకు ఈనాడు మనస్సులో జ్ఞాపకం తెచ్చినాడు తీర్ధమిత్రుడు. పాశ్చాత్య స్త్రీల మోములవలె కనబడకపోయినా, సిగ్గుతో మోమంతా యెర్రటి రక్తంతో జేవురించిపోతూ ఉండగా, అడుగడుక్కీ తూలిపోతూ, యాలక్కాయ ఒలిచి నోట్లో వేసుకొంటున్న త్యాగతి వద్దకు నడచివచ్చాను. త్యాగతి వంచిన తల ఎత్తనేలేదు.

    త్యాగతి : నిశాపతిగారు ప్రొద్దున్న బొంబాయి ఎక్స్ ప్రెస్ కు వెళ్ళే ముందర ఆయన్ను నేను కలుసుకున్నాను. ఆయనకు అక్కడి నుండి ఢిల్లీ ప్రయాణమట.

    నేను : నిశాపతి మనలను స్టేషనకు ఎందుకు రమ్మనలేదో? ( అప్పటికి నా మనస్సును కుదుటపరచుకున్నాను,)

    తీర్ధమిత్రుడింతట్లో గబగబా మా వద్దకు వచ్చి ' నిజమే ' అని అంటూ ఉండగానే త్యాగతి అతని మాటకడ్డము వచ్చి అతని స్నేహితులతో చాల ముఖ్యమైన పనుండి బండి కదిలేవరకూ మాట్లాడి, కదలిన తరువాత ఎక్క వలసి వచ్చినదట మిత్రరావుగారూ! మరచిపోయినారేమండీ? అని అన్నాడు. యింతలో కల్పమూర్తి రేడియోలో అతని కంఠము ఎంత మధురంగానో వినబడుతుంది అంటూ వచ్చాడు.

    త్యాగతి : రేడియో సెట్టు హేమ ఇంకా కొనలే దెందుకో ?

    నేను : నాకు నువ్వు ఒక మాంచి సెట్టు కొని పెట్టగూడదూ ?

                                                                                                                       12

    ఒకనాటి వెన్నెలరాత్రి త్యాగతీ నేనూ మాత్రమే అడయారు నది గట్టుమీద వాహ్యాళికి వెళ్ళినాము. ఏటిని పొదుగుకొని యేటి నీటిలో ప్రతి ఫలించే జ్యోత్స్నలు త్యాగతి కళ్ళలో తాండవిస్తున్నవి. ఆ ముహూర్తంలో త్యాగతి మధుమాసశుభ్రాంశునిలా ఉన్నాడు.

     హేమకుసుమదేవీ ! అర్చకుని వై లక్షణ్యాన్ననుసరించే అతని పూజా, పుజాఫలము ఉంటవిసుమా ! ఉపాస్య దేవత క్రీగంటి చూపులకైనా అర్హుడగుటే మహా ప్రసాదం .

     అవునయ్యా, అర్చనకై వచ్చిన భక్తులందరికీ ప్రసన్నత కావాలి గదా ఆ దేవీ ?

     పూజా సౌలభ్యం వర ప్రసాద మెందుకు కావాలి  ?

     వరప్రసాదానికి నలుగురూ అర్హులైతే ?