పుట:Telugu merugulu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

తెలుఁగుమెఱుంగులు


అభికిఁ జుట్టు నఖోతటి కాపలా కాయుచున్నట్లును, సముద్రము లోని నీటిని మెల్లగాఁ బై పైకి మేఘము లెత్తుకొని పోవుటకుఁ జూచి యా యఖితటి యా మేఘముల గిట్టలను (వానకాళ్ళను) బట్టి యీడ్చి క్రిందఁబడవేయఁగా నవి దొంతులు గొని పడియున్న వన్నట్లు సముద్ర తటమున మొగలిచెట్లున్నవి. ఆ మేఘములలోని మెఱపులా యనునట్లు మొగలి పూవులున్నవి.


"తను వస్తాంబుదంబు సితదంతయుగం బధిరాంశు లాత్మగ
ర్జన మురుగర్జనంబు గరసద్రుచి శుక్రశరాసనంబు నై
చన మదవారిపృష్టి హితసస్య సమృద్ధిగ నభవేల నాల
జను గణనాథుఁ గొలు ననిశంబు నభీష్టఫల ప్రదాతగాన్".

దీనికి నా సంస్కరణము

“తను వనితాంబుదంబు సితడంతముఖం విచికాంశు వాత్మగ
ర్జన మురుగర్జనంబు గరసద్రుచి శక్రశరాసనంబు నై
చన మదవారి వృష్టి హితసస్య సమృద్ధిగ నభవేళ నాఁ
జను గణనాథుఁ గొల్తు ననిశంబు నభీష్ట ఫలప్రదాతగాన్"


విఘ్నేశ్వరుఁ డేకదంతుఁడు కొన సితదంతయుగంబని యుండ రాదు. అచిరాంశువు మెఱుపు. అది ఉపమానము కాన అప్పుడప్పుడు మాత్రమే కన్పడునదిగా నుండవలెను. సితదంతముఖం బసుటలో నోరు తెఱచినప్పు డగపడుట, మూసినప్పు డగపడకుండుట దంతాగ్రమునకు కలిగి యచిరాంశుసామ్యము సిద్ధించును.


"ముదమున సత్కవి కావ్యము
నదరఁగ విలుకానీ పట్టినమ్మును బరహ్మ
ద్బి మై తలయూఁపింపని
యది కాష్యమె మలరి పట్టినదియును శరమే?"

(1ఆ - 41 ప)

వ్రాతప్రతిలో నీపద్య మిట్లున్నది.