పుట:Telugu merugulu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగుమెఱుంగులు

39


నుంచుట లక్షణ విశేష నిరూపణార్థముగదా! ఇట్టి వెన్నేని విశేషాంశ ములను నన్నయ రచనలో చూపవచ్చును.


శరత్సమయమున సరళముగా సమప్రదేశమున ప్రవహించు తెలినీటి తేటవాకవలె సన్నయరచన సుప్రసన్నమై, చాటుమాటులు లేనిదై. కరతలామలకముగా తనలోఁగల సర్వార్ధములను ప్రవ్యక్షముగా గుర్తింప నిచ్చునదై, సుఖప్రవేశమై, సుస్వాద్యమై నిర్వక్రగతితో నెగడుచుండును. వ్యాసభారతరచనలో 'చ, వై, తు, హు' లున్నట్లు అక్కడక్కడ నన్నయ రచనలో 'మానుగ, పాయక, పర్వగ, ఇమ్ముల' మొదలగు పాదపూరణపు పొల్లుపదము లుండును. గ్రంథగ్రంథులు నన్నయరచనలో నుండవు, నన్నయ్యశయ్య వంటి పురాణశయ్య కావ్య గౌరవము కలది - భాగవతకర్త కొక్కని కేతక్క మఱి యితర పురాణయుగాంధ్రకవుల కెవ్వరికీ దక్కలేదు. నన్నయ పురాణ శయ్యాసౌభాగ్యమునకు లక్ష్యము నొక్క గీతపద్యమున గుర్తింపవచ్చును.


 ఎల్లవారు నెఱుఁగ నొల్లని ధర్మువు
బేల నీకుఁ దేలుప నేల వలసె?
చికుతవానీ కింత దముగంటి పలుకులు
సన్ని వృద్ధజనము లున్నచోట?"


రాజసూయమహాధ్వరము జరుగునపుడు భీష్ముడు ధర్మరాజుతో 'సఖిలలోకపూజ్యు నచ్యుతుఁ బూజింపు' మనఁగా శిశుపాలుఁ డుపాలంభన పరుండయి యధోక్షజు నాక్షేపించుచు ధర్మరాజు కిట్లనుచున్నాఁడు,


“అవనీనాథు లనేకు లుండఁగ విశిష్టాచార్యు లార్యుల్ మహీ
దీవిటుల్ పూజ్యులు పల్వు రుండఁగ ధరిత్రీసాథ! గాంగేయ దు
ర్వ్యవసాయంబునఁగృష్ణుఁ గష్టచరితున్ వాయుఁ బూజించి నీ
యవివేకం బెఱిగించి లిందఱకు దాశారుండు పూజార్హుడే?"