పుట:Telugu merugulu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

తెలుఁగుమెఱుంగులు



వివిధవేదత త్త్వవేది వేదవ్యాసుల
దాదిముని రాశరాత్మజుండు
విష్ణుసన్నిథుండు విశ్వజనీనమై
పరగుచుండఁ జేసె భారతంబు",

ఇట్టి సంస్కృత భారతమును,


“సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకవితార్ధయుక్తిలో
నారసి మేలునా నితరు లక్షరరమ్యత నాదరింప నా
నారుచిరార్థ సూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
భారత సంహితారచన బంధురుఁ డయ్యె జగద్ధితంబుగాన్. "


నన్నయ పైతీరున సర్వశాస్రాధాకలితముగానే కాక భారతమును ప్రసన్నరచనతో మహాకావ్యలక్ష్యముగాఁగూడ తెనిఁగించిన ట్లేర్పడును. కనుకనే యాతనికి వాగనుశాసన బిరుదము కల్గెను. సంస్కృతమున పురాణములు, కావ్యనాటకాదులు అన్నియు వెలసినపిదప ఉపక్రమించిన దగుటచేత తెలుఁగుపురాణరచన తనలోనే సంస్కృత సర్వకావ్యరచనా చమత్కారములను ఇముడ్చుకోవలె ననుయత్నముతో సాగినది. ప్రాచీనుఁడు గణపతిదేవుఁ డనుకవి "ఆంధ్రకావ్యపథము దీర్చిన నన్నయభట్టుఁ గొలుతు" నన్నాఁడు. నన్నయభారతము చదివినచో అందులో భాషా కవితాలక్షణ పరిష్కారములను ప్రయత్నపూర్వకముగా నన్నయ లక్ష్మీకరించినట్లు కాననగును.


 “పాయక పాకశాసనికి భారతఘోరరణంబునందు నా
రాయణు నట్లు వాణసధరామరవంశవిభూషణంబు నా
రాయణభట్టు వాఙ్మయ దురంధరుఁ డీకృతి కష్టుడున్ సహా
ధ్యాయుఁడు నేనవాఁ దభీమతంబుగఁ దోడయి నిర్వహింపఁగాని


ఈ పద్యము ద్వితీయ తృతీయ చరణములందు నారాయణ పదము "ర" యతి ఖండా ఖండములుగా స్వరష్యంజనములతో రెండు దెఱంగుల