పుట:Telugu merugulu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

తెలుఁగుమొఱుంగులు


ఇట్టి పురాణములు సంస్కృత భాషామాత్ర పరిజ్ఞానము గల జనసామాన్యమునకుకూడ అర్ధము కాఁదగినట్లు సులభభాషలో, ప్రాయికముగా సులభమైన అనుష్టుప్ఛందస్సులో తేలిక వాక్యాన్వయములతో తేటగా ఉండును. వ్యాసులవారి రచనలలో తఱచుగా 'చ, వై, తు, హీ' అని పాదపూరణపు పొల్లుపదము లున్నవి అనికూడ పండిత పరిహాసమున్నది. పురాణ సామాన్యరచన ఇట్లు ఉండు నసుట సంగతయేకాని, కొన్ని పట్లు పురాణములలోనివే, సంప్రదాయ పరిజ్ఞానము లేనిచో ప్రౌఢపండితులకు కూడ కొఱకరానీకోయ్యలు, ఉక్కుసెనగలు అనఁదగినవిగా ఉన్నవి. పురాణములలోని కెల్ల భారత భాగవతములు. రామాయణము ప్రధానమయినవి. రామాయణ భారతములు కావ్యేతిహాసము లనబడినను, పురాణము లనికూడ సామాన్య వ్యవహార మున్నది. తెలుఁగున అవి పురాణములే అనుచున్నాము. ఉక్కుసెనగలు పై మూఁడు గ్రంథముల లోను, అందులో మఱీభారతమున ఉన్నవి. భారతములోని ఉక్కుసెనగలకు వ్యాసఘట్ట మని పేరు. మచ్చు చూపుచున్నాను.


పశ్యః పశ్యతి పశ్యన్త మపశ్యస్తంచ పశ్యతి,
అపశ్యస్తావ (త్యాద?) చక్షుష్యాత్ పశ్యాపశ్యా న పశ్యతః
చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ,
హూయతేచ పునర్యాభ్యాం సమే విష్ణుః ప్రసీదతు.


ఈ విధముగా పురాణములు వివిధ విషయములతో, వివిధ రచనలతో అరణ్యములవంటి పై ఉండును. అర్వాచీనము లయిన కావ్యనాటక ప్రబంధాది రచనలు పురాణారణ్యములనుండి ఉద్ధరించి సేకరించి తీరిదిద్ది నాటిన యుద్యానములవంటి వసఁదగును. పురాణములలో కావ్యనాటక ప్రబంధాదిరచనల పొలుపులు సుకుమార దృశ్యములై ఉండునుగాని, కావ్య నాటకాదులలో పురాణరచనములలోని శాస్రాంశ భీకర దృశ్యము లుండవు. ఇటువంటి సంస్కృత పురాణ ఫక్కీ ననుసరించి తెలుఁగు పురాణరచన