Jump to content

పుట:Telugu merugulu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28 తెలుఁగుమెఱుంగులు

28

తెలుఁగుమెఱుంగులు


వ్రాసి పంపుకొన్నాఁడట.

లా వొక్కింతయు లేదు, ధైర్యము విలోలం బయ్యెఁ, బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను, మూర్ఛ వచ్చెఁ, దనువున్ డస్సెన్, శ్రమం బయ్యెడిన్
నీవే తప్ప నితఃపరం బెఱుఁగమన్నింపందగున్ దీనునిన్
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

బ్రౌనుదొరగా రా దీనుని కేదో కొంత సొమ్ముతోపాటు ఆ యర్జీమీఁదనే ఎండార్సుమెంటు'గా ఈ క్రిందిపద్యమును వ్రాసి పంపినారట.

ఏను మృతుండ నౌదునని యింత భయంటమనంబులోపలన్

మానుము సంభవంబు గల మానవకోట్లకు చావు నిక్కమౌల గాన హరిం దలంపు మిఁకఁ గల్గదు జన్మము నీకు రాత్రిపై మానవనాథ! చెందెదవు మాధవలోకనివాససౌఖ్యముల్</poem>

బ్రౌనుదొరగారికికూడ భాగవత మింత పరిచితమయినది !

ఇన్ని ఉదాహరణములను ఎందుకు చెప్పినా ననఁగా, మన తండ్రితాతల పోలిక చాలికలు మనలో ఏవిధముగా అనుగతములై వచ్చుచున్నవో - మనము వేషభాష లెంతమార్చినప్పటికిని - మన పూర్వుల గ్రంథములలోని భావములు, సంప్రదాయములు, రచనలు - మనమెంత క్రొత్త త్రోవలు తొక్కఁజూచుచున్నప్పటికినీ మనలో ఎట్లు కుదుర్కొన్నవో తెలుపుటకే. వానిని మనము విడనాడలేము. విడనాడనూ కూడదు అని యెఱి గించుటకే.