పుట:Telugu merugulu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీశాస్త్రి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వారి హృదయం స్పృశింపని విషయం లేదు. నన్నయ నుండి నారాయణుని వరకూ. భాషాశాస్త్రం నుండి భాషా వధూటి వరకూ - అక్షరంనుండి అక్షరతత్త్వంవరకూ - యోగంనుండి యోగేశ్వరుని వరకూ. పరమాన్నంనుండి పరమాత్మవరకూ సజీవస్రవంతిగా ప్రవహించింది - ప్రవహిస్తుంది - ప్రవహిస్తుంది - శ్రీశాస్త్రిగారి 'అక్షరగంగ'. వీరి పరిశోధనలూ, విమర్శలూ సాహితీకృషీవలులకు బంగారుపంటను పండిస్తాయి. నూతనాలోచనలనూ. పరిశోధనాసక్తినీ ఇసుమడింప జేస్తాయి. గుణాన్ని గుణంగా,దోషాన్ని దోషంగా వివరించడంలో శ్రీ శాస్త్రిగారు "నిర్మాగూటం'గా వ్యవహరించడం వీరి వ్యాసాల ద్వారా వ్యక్తమవుతుంది. ముఖప్రీతికీ - సాహితీప్రీతికీ పొత్తు కుదురదు కదా!

శ్రీ శాస్త్రిగారు సమాజానికి త్రికరణ శుద్ధిగా - త్రికరణాలకూ సేవచేసన ధన్యులు.

శ్రీ.శాస్త్రిగారి 120 వ జయంతి సందర్భంగా పునర్ముద్రించిన నాల్గు పుస్తకాలు సాహితీ సౌధానికి నాలుగుస్తంభాలు ఇందులో ముఖ్బ్రాముఖ్యాలకు తావు లేదు. దేని ప్రాముఖ్యం, విశిష్టత దానిదే! సహృదయర సాహితీలోకం ఆవిశిష్టతకు దర్పణం.

శ్రీశాస్త్రిగారి కాంస్య విగ్రహాన్ని 'శ్వేతకు ఎదురుగా స్థాపించడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగులకే కాక, 'శ్వేత'ను. అటు శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయాన్ని దర్శించి, ఉభయత్ర - అనేక కార్యక్రమాలపై వచ్చే విద్యార్ధులకూ, పెద్దలకూ కూడ శాస్త్రిగారినిగూర్చిన పరిచయం. అవగాహన చేకూర్తుంది. ఈ నిర్ణయం మిక్కిలి అభినందనీయం!

శ్రీ శాస్త్రిగారి జయంతి, వర్థంతి - సందర్భంగా క్రమంగా వారి రచనలు ముద్రింపబడి - సాహితీప్రియులకు అందుబాటులో ఉండే విధంగా కృషి జరుగుతూంది. ప్రతిఫలాపేక్ష లేకుండా, నిస్స్వార్థంగా, నిష్కళంకంగా సాహితీ సమాజ సేవతో ధన్యులైన శాస్త్రిగారు ఆదర్శ పండితులు. పరిశోధక శిరోచుణులు. ఉత్తమ యోగులు

కృతజ్ఞతాంజలులతో,

తిరుపతి. 29.01.2008 మరి కొన్విలావణ్యం (నమిడికాల్వ చెంచుసుబ్బయ్య)