పుట:Telugu merugulu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

తెలుంగుమెఱుంగులు


. భుజము లెత్తినప్పుడు వర్ణ్యము భుజశిఖరము లగునో, యిం కేమగునో చర్చ యెందుకు? 'పెద్దనామాత్యుఁడే తెనాలిరామలింగఁ డన్నట్టు 'బాహుమూలరుచి' వర్ణనాభిమానము విడువఁజాలక కాఁబోలు మరల మరల నీ తీరుననే పంచమాశ్వాసమున వర్ణించినాఁడు.


ఉత్కంరాగ్రయై నిక్కి నా


ధుని మౌళిన్ దలఁప్రొలువోసె నవలా దోర్మూలకూలంకష
స్తనవిస్ఫూర్తికి సందిదండలధళల్ సాహోని సాదం బిడన్

ముడివడు కంకణ ప్రభల ముత్తెపు సేసలు దోయిలించి యె
తాడు తటి బాహుమూలకుచదీప్తుల పైఁ బతిదృష్టి పర్వీనన్
బాణీయుగమున్ వెసవంచియ మౌళిమీఁదికై
పొడవునం జల్లె- "

(మనుచరిత్ర 5 ఆశ్వా)

రంగనాధ రామాయణమందును ఇట్టి వర్ణన ఉన్నది. ఇదిగో.

“పొంగారు కుచకుంభములు పదార్వన్నె
బంగారుపొడిరాలు బాహుమూలములు",

పెద్దనామాత్యుఁడు తాను తొలుతఁ జెప్పిన పద్యములోని 'ప్రాంచ ద్భూషణము' లను స్పష్టముగాఁ బంచమాశ్వాస పద్యమున 'సందిదండ'లని తెలియఁజెప్పినాఁడు గదా !