పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/803

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సోదె:

ఇంటింటికీ తిరిగి జరిగిన విషయాలనూ, జరగబోయే విషయాలనూ సోదె చెప్పే ఎరుకల స్త్రీలను గురించి అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సోదెలో కోగంటి

అంబా పలుకు, జగదంబా పలుకు, మాయమ్మా పలుకు, కంచి కామాక్షమ్మ పలుకు అంటూ...

ఓయమ్మ మేం పిశాచులం గాదే
పెను భూతాలం గాదె; మాతృద్రోహులం గాదె
మంత్రగాళ్ళం గాదె పెద్ద దోపిడిగాళ్ళం గాదు
ఫాసిస్టు భూతాలం గాము
నీ గర్భవాసాన పుట్టిన బిడ్డలమండీ
తెలియదే తల్లి
నికృష్టపాలన నిలువునా చెండ
ప్రతిజ్ఞ పట్టామె భారతాంబా మము
గన్నతల్లీ


అంటూ ఎన్నో జాతీయ సమస్యల వరకూ ఏకరువు పెట్టి ప్రేక్షకులకు కనువిప్పు కలిగించే వారు.

బుర్ర కథలు:

నాటి నుండి నేటి వరకూ బహుళ ప్రచారం పొందిన జంగం కథలు ఈ నాడు బుర్ర కథలుగా వెలువడుతున్నాయి. ఒకనాడు మత ప్రబోధానికి, అధ్యాత్మిక తత్వానికి అనుకూలంగా ఉపయోగపడిన జంగం కథలను దేశ భక్తికి ప్రతి బింబాలుగా సుంకర కష్ట జీవి, రైతు విజయం, స్టాలిన్ గ్రాడ్ యుద్ధం, వీరేశలింగం, అల్లూరి సీతారామ రాజు మొదలైన అనేక బుర్రకథలు రచించారు.

నాజరు బెంగాలీ కరువు బుర్ర కథను, పల్నాటి వీరచరిత్రను, బొబ్బిలియుద్ధం మొదలైన బుర్ర కథలను ప్రజానాట్యమండలి కళాకారులైన నాజరు, పురుషోత్తం, రామకోటి, మిక్కిలినేని, మాచినేని, పట్టం సెట్టి, కోసూరి పున్నయ్య, పిరివి సెట్టి, పెరుమాళ్ళు, చదలవాడ, పల్లం, కేశవ రావు మొదలైన అనేక మంది కళా కారులు రాష్ట్ర వ్యాపితంగా వ్యాపింపచేశారు.