పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/800

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్వలోక ప్రజ - సోవియట్ తో జేరి
స్వేచ్ఛకై పోరాడుతున్నాదయా ॥తం॥

తుమ్మెద పాట:

ఆంధ్రదేశంలో దసరా పర్వదినాలలో శ్రామిక జన స్త్రీలు, తుమ్మెద పాటలు పాదుకుంటూ రైతు ఇళ్ళకు వచ్చి పారితోషికాలను పొందుతారు. అదే రీతిలో యుద్దాన్ని గూర్చి సుంకర గేయం ఇలా వెలువడింది.

పాడవే పాడవే తుమ్మెదా
మంచి పాటలెన్నో పాడు॥తు॥
పండించు పండించు ॥తు॥
మంచి పంటలను పండించు ॥తు॥
దేశాన చూడవే తుమ్మెదా ॥తు॥
పెద్ద తిండి కరువొచ్చింది ॥తు॥

పకీరు గీతాలు:

ముఖ్యంగా పకీర్లు అల్లా నామాన్ని జపిస్తూ మహమ్మదీయులను ఆశీర్వదిస్తూ మహమ్మదు ప్రవక్త బోధనలు ప్రచారం చేస్తూ వారిని మాత్రమే యాచిస్తారు. ఆ గీతాల్లో కోగంటి హిందూ ముస్లిం ఐక్యత గూర్తి ఇలా వివరించాడు.


పాడి పంటల్ సల్ గుండాలి ॥ఆల్లాకెనాం॥
తల్లి పిల్లల్ సల్ గుండాలి "
అన్ని జాతుల ప్రజలు "
వార్కి హేకం కావాలండి "
హిందూ ముస్లింము "
వార్కి హేకం కావాలండి "


క్వారీ పాట:

కొండ రాళ్ళను బండ రాళ్ళను పగల కొడుతూ శ్రమను మరిచి పోవటానికి ఒక రయం ప్రకారం గొంతులు కలుపుతూ వుంటారు. సుంకర హిందూ ముస్లిం ఐక్యతను ఈ విధంగా ప్రబోధిస్తాడు.