పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/762

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంబల వారు అయ్యగారి దర్శనానికి చెందిన హరిజనులనీ, వీరి వాయిద్యం పంబ జోడనీ, వీరు ఎక్కువగా అంకమ్మ కథలను పాడుతారనీ, వీరు కొలిచే అంకమ్మకు, మారాసపు అంకమ్మ అని పేరనీ వంతలు పంబజోడును వాయిస్తూ శ్రుతికి తిత్తి ఊదుతూ వుంటే కథకుడు రాజకుమారునిలా వేషాన్ని ధరించి కుడిచేతితో పెద్ద కత్తినీ, ఏడమ చేతితో అమజాల అనే చిన్న కత్తినీ పట్టుకుని వీరా వేశంతో చిందులు తొక్కుతూ కథను పాడుతారనీ, డా॥ తంగిరాల వెంకటసుబ్బారావుగారు జానపద కళోత్సవాల సంచికలో వివరించారు.


కడ్డీ వాయిద్యం

మిత్తుల అయ్యవార్లనీ, దాసరులనీ పిలువబడే వీరు, ఈ కడ్డీ వాయిద్యంలో ప్రవీణులు. ఈ వాయిద్యం వీణ మాదిరిగా ఉంటుందట. వీణ మాదిరే దీనిని కూడ చేతి వ్రేళ్ళతోనే వాయిస్తారు. వీరు ముఖ్యంగా ఈ వాయిద్యం మీద భగవన్నామ సంకీర్తనలు వాయిస్తూ వుంటారు.

ఈ వాయిద్యాన్ని ముందు నిల బెట్టుకుని రెండు సన్నని పుల్లలతో జలతరంగ్ వాయిద్యాన్ని వాయించి నట్లు వాయిస్తారు. ఈ స్వర మాధుర్యం ఎంతో మధురంగా వుంటుంది. వీరి వృత్తికి ప్రాణప్రదానమైంది ఈ వాయిద్యమే. అయితే ఈ వాయిద్యాన్ని అందరూ వాయించ లేరు. దీనికి ప్రత్యేకమైన శిక్షణతోనూ, సాధనతోనూ సాధించవలసిందే. అందువల్లనే ఈ వాద్యకాండ్రలో ప్రవీణులు చాల తక్కువ. తెలంగాణాలో ఈ వాయిద్యంలో ప్రసిద్ధులైన వారు కరీంనగర్ జిల్లా మెట్టుపల్లి తాలూకాలో వున్నారు. ఈ కళారూపాన్ని శిధిలం కాక ముందే రక్షించుకోవడం అవసరం.


తుమ్మెద పాటలు

దసరా పండుగ వచ్చిందీ అంటే ఆంధ్ర దేశపు పల్లెల్లో కూలీ స్త్రీలు చక్కగా రంగు రంగుల చీరలు ధరించి, కొప్పులో బంతి పువ్వులు చుట్టి వయ్యారంగా సీతాకోకచిలుకల్లా మృదుమధురమైన కంఠంతో