పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/702

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

670

జానపదకళారూపాలు


రాయలసీమలో:

రాయల సీమలో వున్న పిచ్చు కుంట్లు వీర శైవులు. రాయలసీమలో వీరు ఎలనాగి రెడ్డి కథ ఎనిమిది రాత్రులు పాడతారు. వీరి గురువులు జంగాలు, పురోహితులు కూడా. వీరు మొదట గంట, తిత్తి మాత్రమే ఉపయోగించేవారు. తరువాత జంగాల ప్రభావం వల్ల చేత తంబుర, గుమ్మెటలు ఉపయోగించే వారు.

తెలంగాణాలో జంగాలు ఉపయోగించే బుడిగెలు ఇటు వంటివే, వీరి వేషం జంగాల వేషంలాగే నిలువు టంగీ షరాయి, నడికట్టు తలపాగా వుంటుందని డా॥ తంగిరాల సుబ్బారావు గారు జానపద కళోత్సవాల సంచికలో ఉదహరించారు.

పాత కథలూ,కొత్త కథలూ:

అదే పిచ్చుకుంటుల కథా విధానాన్ని 1943 లో వచ్చిన కంట్రోలు, రేషనింగు విధానాల ద్వారా కరువుతో ప్రజలు పడిన బాధలను వివరిస్తూ వారి సమస్యలు తీసుకుని కోసూరి పున్నయ్య, ఆకలి మంటలు అనే పిచ్చుకుంటుల కథను వ్రాసి ప్రజా నాట్య మండలి ద్వారా ప్రచారం చేశారు. తక్కువ సంపాదనతో ఎక్కువ రోజులు పస్తులుండే పేదవారి బ్రతుకుల్ని గురించి ఇలా వివరించారు.

ద్విపద

తిండికి బట్టకీ - తిప్పలొచ్చేను
కొండలై పెరిగేను - కొనుగోలు ధరలు
కష్టపడి పనిచేయు - కడుపు నిండదుగ
కష్టాలు హెచ్చేను - కరువొచ్చి నాదో....
                  ॥శ్రీమదంబా భారతాంబా జగదాంబా॥

అంటూ

ద్విపద

పూరి గుడిసెల్లోన - పువ్వుటెండల్లు
నోరు లేనీ పేద - తేరు కొనుటెట్టు
తాటాకు గుడిసెల్లో - బొటబొట వాన
కట్ట బట్టాలేక - గంజితో బ్రతికె