పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/684

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాదాత్మ్యం చెందించే తప్పెటగుళ్ళు

ఆంధ్ర దేశంలో ముఖ్యంగా విశాఖపట్నణం, విజయనగరం, శ్రీకాకులం, జిల్లాలలో తప్పెట గుళ్ళు కళారూపం ప్రచారంలో వుంది. ఇది సంప్రదాయ నృత్యం. గొల్ల కులానికి చెందిన వారు ఎక్కువగా చేస్తూ వుంటారు. వారికి పశువులూ, గొఱ్ఱెలూ, మేకల మందలూ ఎక్కువ. వర్షాలు పడక పశుగ్రాసానికి

కూడా కష్టమైనప్పుడు భగవంతుని కటాక్షంకోసం చేసే దేవతారాధనలో ఈ తప్పెట గుళ్ళు ప్రముఖ స్థానం వహిస్తాయంటారు బిట్టు వెంకటేశ్వర్లు గారు.

ముఖ్యంగా యాదవులు జరిపే గంగ జాతర దశావతారాలు ముఖ్య మైనవి. కాటమ రాజు భార్య గంగమ్మ, పార్వతీ దేవి శివుని ఆజ్ఞ మేరకు కాటమరాజు భార్యగా జన్మించిందనీ,ఆ గంగమ్మ యాదవ కులానికి ఆరాధ్య దేవత అనీ, యాదవుల నమ్మకం. శివుని దర్శించిన భక్తులందరికీ అన్ని వాయిద్యాలనూ ఇచ్చి వేయగా మిగిలి పోయిన తప్పెట గుళ్ళను మాత్రం మిగిలిని యాదవులకు ఇచ్చారని వారి కథనం. తప్పెట గుళ్ళు రొమ్ముకు వ్రేలాడేటట్లు కట్టుకుంటారు. రొమ్ము మీదే ఆ వాయిద్య