పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/488

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక వేళ గ్రామస్థులు కథలు చెప్పించక పోతే ఉగాది మరుసటి రోజున తప్ప కుండా చిందులు వేస్తారు. అందుకే వారిని ఆయగా ళ్ళంటారు. దేవత సమక్షంలో జంతువుల బలి సమయంలో, ఈ విధంగా పాడుతారు.

పెద్దమ్మ తల్లికి :

పూజ చేతామురో యమ్మ - పెద్దమ్మ తల్లికి
పూజ చేత్తామురో - పున్ని మంతులు మీరు
మల్లి పూవులు దెచ్చి - మనసార వెల్లుదాము
బాగుగా బలిపిల్లలు గొట్టి - కర్మ పోతులను
కడగా కొట్టి ఆసాది వాండను - ఆటలాడమని
సన్నమేళముల సందడి చేయమని
సకియలారో, పెద్దమ తల్లికి జూజ చేద్దాము
రోయక్క; కొండ చక్కెర, కర్జూరములు, మంచి తేనియో
మా పెద్దమ్మ స్వామికి పలము రుసుములు పూజ సేత్తము.

అంటూ సుబ్బారావు పేటకు చెందిన మాదిగ నాగన్న పాడిన పాట. ఇది అనంతపురం జిల్లాలో ధర్మవరం తాలూకాలో వున్న ఆసాదుల కళారూప మిది.