పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/393

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రంగా వుంటుంది. ఆ కోలాహలాన్ని చూచి ఆనందించి అనుభవించాల్చిందే గాని వర్ణించటం సాధ్యం కాదంటారు. గద్య చదివే సందర్భంలో బండిని ఆపి వేస్తారు.

గద్య చదివే నాయకునికి వంత దారులు ఊతమిస్తూ, గద్యను అతి సుందరంగానూ, శ్రావ్యంగానూ వల్లిస్తూ మధ్య మధ్య బుర్రకథలో మాదిరి భళి భళీ అనీ, బాపురే అనీ, అయ్యయ్యో సిగ్గు సిగ్గూ అనీ, గద్యకు వంత పలుకుతూ మేళ నాయకునికి ఊతమిస్తారు. మేళ నాయకుడు మెడలోనూ, కుడిచేతి మణి కట్టుకూ గుబాళించే మల్లెపూల దండలను ధరిస్తాడు. మంచి నిషాలో వుండి ఖుషీగా మెరవణి గద్యను పఠిస్తూ, జనాన్ని హుషారు పరిచే భంగిమల్లో ఊగి పోతుంటాడు. ఉభయపక్షాల బంధువులే కాక, ఊరి జనానికి కూడ ఇదొక ఆనందదాయకమైన వేడుక.

స్త్రోత్ర పాఠానికి ఉదాహరణ

వోహో హోయ్ యోయ్
పాగల రాతి గుండు పగల గొట్టగ వచ్చు
కొండ లన్నిటి పిండి గొట్టవచ్చు
విశ్వదాభి రామ వినుర వేమ.

అదేమాదిరి,

తూమాటోళ్ళ నారణప్ప అంటే
చప్పన్నారు దేశాలలో సరదారు
ముప్ఫై ఆరు పల్లెల్లో మంజూరు
యొక్కంగ గుఱ్ఱాలు - ఏడూర్ల పెత్తనం
కుచ్చుల్ల తురాయి - పచ్చల్ల పల్లకి
ఐదేళ్ళ కుంగరాలు - అస్తి కడియాలు
ఇదిగో అంటే - ఇరవై మంది
పని బడితే పాదాల కడ - పదివేల మంది
నారప్ప ముట్టింది ముత్యమై
పట్టింది బంగారమై
ఎద్దు తొక్కిన భూమి
యెయి పుట్లు పండింది.