పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
దండకం:

భజే భద్ర! భద్రాంబికా ప్రాణనాథా! సురరాతిభంగా!ప్రభో!రుద్ర! రౌద్రావతారా! సునాశీరముఖ్యామకానేక సంభావితా సల్ప సుశ్లోక!! చారిత్ర! కోట్యర్కసంకాశ! దేదీప్యమాన! ప్రభా దివ్వగాత్ర! శివా! పాలితా! శేషబ్రహ్మాండ భాండోదరా! మేరుధీరా! విరాడ్రూపా! వారాశి గంభీర! సౌజన్య రత్నాకరా! వారిదశ్యామ__

మహాదివ్య వేషా! హరా! భక్త పోషా! దయావార్థి ! వీరేశ్వరా! నిత్య కళ్యాణ సంధాన ధౌశీయ! పాపాలు నీకేల! దావానలా! పుణ్యమూర్తీ ! నమస్తే! నమస్తే- నమః.

అంటూ ముగిస్తారు.


ఖడ్గం:

మూడడుగుల వంకర ఖడ్గాన్ని చేతిలో ధరించి, పై దండకాన్ని చదువుతూ, ఖడ్గాన్ని ఊపుతూ, కనుగ్రుడ్లు పెద్దవి చేసి నారసాలను శరీరంలో పొడుచుకుని, వీరావేశంతో వళ్ళు మరచి నృత్యం చేస్తూ, దక్షయజ్ఞ గుండంలో నడుస్తూ అవతల ప్రక్కనున్న దక్షుణ్ణి నరుకుతారు. ఈ ప్రదర్శనాన్ని చూడవలసిందే గాని వ్రాయలేము. జంగాల్లో అనేక తెగలున్నా అందర్నీ జంగాలనే పిలుస్తున్నారు. ఆంధ్రదేశంలో ఈ బుడిగె జంగంవారు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖ పట్నం,

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఆ యా వృత్తులలో ఈ నాటికి జీవిస్తున్నారు. ఈ బుడిగె జంగాలను ప్రభుత్వం ఆదరించి వారిని పరిగణనలోకి తీసుకుని, ఇతర షెడ్యూల్డ్ జాబుల కిచ్చే సౌకర్యాలన్ని కలిగించే ఏర్పాట్లు చేయాలి.