పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజలు మెచ్చిన బయలు నాటకాలు


జానపద కళాకారులందరూ, జానపద కళారూపాలను వీథుల్లోనె ప్రదర్శించేవారు. పల్లెలో వుండే విశాల బహిరంగ స్థలమే వారి రంగస్థలం.


అయితే ఇలాంటి ప్రదర్శనాలను రాయలసీమ ప్రాంతంలో బయల్నాటకా లంటారు. యక్షగానాలనూ, వీథి నాటకాలనూ బయలు నాటకాలనే పిలుస్తారు.

గరుడాచల మహాత్మ్యం:

గరుడాచల మహాత్మ్యంలోని ఇతి వృత్తాన్ని, పాటల్ని తీసుకుని జానపదులు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. ఇందులో నాటకం, నృత్యం రెండూ కలిసి వుంటాయి. హర్మోనియం, గజ్జలు, తాళాలు మాత్రమే ప్రదర్శనంలో ఉపయోగిస్తారు.

ఈనాటకంలో సింగి నాయకుడు __రంభ __ఊర్వసి, నరసింహస్వామి __ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, ఎరుకలసాని (సింగి) సింగడు, ద్వారపాలకులు వుంటారు. వారే కిరీటాల్ని __ భుజకీర్తులను తయారు చేసు కుంటారు. పురుషులే స్త్రీ పాత్రలను ధరిస్తారు.పాత్రధారు లందరూ వేషాలు ధరించిన తరువాత మిగిలినవారు వంతలుగా నిలబడతారు. ప్రతి పాత్రధారీ ప్రవేశించి గుండ్రంగా తిరుగుతూ వయ్యారంగా చేతులు వూపుతూ, కూర్చుని లేస్తూ వుంటారు.

నరసింహస్వామి పాత్రధారి ఠీవిగా చేతుల్ని త్రిప్పుతూ, రౌద్ర రూపంలో అడుగులు వేస్తూ కళ్ళప్పగించి చూడటం అభినయిస్తాడ్రు. నరసింహ స్వామి తో అదిలక్ష్మి, చెంచులక్ష్మిల సంవాదం. ఆతను ఏమీ తెలియనివాని వలె ఉండటం, చెంచు లక్ష్మి ఈ విషయాన్ని ఎరుకలసాని (సింగి) ఆదిలక్ష్మికి చెప్పటం ముఖ్యమైన కథ. ఇంకా సింగి నాయకుల బిడ్డలుగా, రంభ, ఊర్వశులు చిత్రీకరించారు. దీంట్లో సింగి, సింగడు సన్నివేశంలో పాడుకునే రెండు గేయాల్ని పరిశీలించటం జరుగుతోంది.