ఈ పుట ఆమోదించబడ్డది
అక్షయంగా వెలుగొందిన యక్షగానం
117
శ్రీనాథుని వివరణ:
శ్రీనాథుడు దక్షవాటీ మహాపురమును (అంటే నేటి ద్రాక్షారామ) భీమ ఖండంలో వర్ణిస్తూ...
కీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు
గాంధర్వమున యక్షగాన సరణి.
అని అన్నాడు. అంటే శ్రీనాథుని కాలంనాటికి కూడా యక్షగానాలను మనం పాట గానే గుర్తించ వచ్చు.
అలాగే కాశీఖండంలో
పల్లకి చక్కి కాహళము వంశము ధక్క హుడుక్క ఝుర్ఘరుల్
ఝుల్లరి యాదిగా గలుగు శబ్ద పరంపర తాళ శబ్దమై
యుల్లసిలం బ్రబంధముల నొప్పగ నాడుదు రగ్రవేదిపై
బల్లవపాణులీశ్వరుని బంట మహేశులు పూజసేయగన్.
అని ఉదహరించాడు.