పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

జానపదకళారూపాలు


దించి గ్రామ జాతర్లలోనూ, ఘనత గడించి, రాజసభల్లోనూ ప్రవేశం సంపాదించి, ప్రాపకం పొంది ప్రదర్శింపబడింది. ఈ కళారూపాన్ని అడవి జాతులవారి తరువాత అభివృద్దిలోకి తెచ్చినవారు జక్కుల వారు. వీరి నృత్యం కంటే గేయానికి, గానానికి, వచనానికి ప్రాముఖ్య మివ్వడం వల్ల అవి యక్షగానరూపంలో అభివృద్ది పొందాయి.

ప్రాథమిక దశలో కురవంజి ఒక క్రమం లేకుండా ప్రదర్శిపబడేదని వినికిడి. కథలో వచ్చే అన్ని పాత్రలకూ ఒక్కడే నిర్వచనం రాను రానూ నాటకాల్లోని నాందీ ప్రవస్తావన, సూత్రధారుడు, నటి, నర్తకి విటుడు, విదూషకుడు, చేటకుడు, మాదిరి, సింగీ సింగడూ వచ్చి పురుష పాత్రలకు సింగడూ, స్త్రీ పాత్రలకు సింగీ ప్రాతినిధ్యం వహించేవారు. ఈ పాత్రల మధ్య ప్రేక్షకులను నవ్వించేందుకు తోలుబొమ్మ లాటలో జుట్టు పోలిగాడి మాదిరి - కొంటె కోణంగి ఒకడు ప్రవేశించి _ సింగీ సింగని మధ్య చెణుకులు వేస్తూ_ ఇద్దరి మధ్యా కయ్యాలు పెంచి పరిష్కరించేవాడు.

ఇలా కురవంజి కళారూపం క్రమానుగతంగా పరిణామం పొందింది. కురవలు ఈ కళారూపాన్ని ఏదో వినోదం కొరకు ప్రారంభించినా క్రమేపీ ఇది వారి జీవనోపాధికి తోడ్పడింది. ఏ క్షేత్రంలో వారి కార్యక్రమం వుంటుందో ఆ యా యాత్రా స్థలం యొక్క పవిత్ర కథల్నీ, గాథల్నీ ఆశువుగా చెప్పి వారు యాత్రికుల్ని ముగ్దుల్ని జేసేవారు.

ద్రావిడ కళారూపం:

ఇలా పరిణామం పొందిన కురవంజి కళారూపం, ఈ నాడు మన ఆంధ్ర దేశపు ప్రదర్శనాలలో మచ్చుకు కూడా కనిపించక పోయినా, ఇది సోదె చెప్పేవారిలో కొంచెం మిగిలి వుంది.

కాని దక్షిణ దేశంలో "కొఱత్తి యాట్టమ్", కన్నడ దేశంలో "కొఱవంజి" , తెలుగు దేశంలో "కురవంజి ఎరుకలసాని" అని ప్రచారం పొందింది.

ఆంధ్రదేశంలో జీవ కొరవంజి రామమోహన కొఱవంజి,జానకీ నుభోల్లాస కొఱవంజి అనే నాటకాలు ప్రచారంలో వున్నాయి.