పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కురవలకురంజి

93


శుకసప్తతి కథలు వ్రాసిన కదిరీపతి ఒక రాజుగారిని దర్శింప వచ్చిన కొఱవంజిని జూచి,

ఇరుకువలి గుబ్బచన్నుల - యఱుకుజవరా లొకొర్త 'ఎఱుకోయవ్వా,
యెఱుకో'యని తన చందం - బెఱుకవడంగా హజార మెలమిం గదిసెన్.

అప్పుడప్పుడంతుక తెఱం గమ్మహేంద్రుండు పరిచారికా జనంబులవలన విన నవధరించి సమ్ముఖమునకు రావించిన,

నవరని వని వన్నెఱవిక పిక్కటిలంగ గులుకు పాలుబ్బు గుబ్బలు చెలంగ
ముంజేతులను ముఖాంబుజమున నొక వింత పొలుపు దెల్పెడు వచ్చబొట్టు లెసగ
గుఱుమాపు పయ్యెంటచెఱగులో నిడుకొన్న ముద్దుబల్కుల చిన్నిబుడత డమర
దరతరంబులనుండి తమ ఇంట వెలయు పుత్తడి పైడిబుట్ట మస్తమున వెలుగ
బొమలసందున నామంబు, భూతి పూత-నెన్నొసట, బుక్కిట విడెంబు, కన్ను గొనల
గాటుక రహింప వచ్చి యా క్ష్మాతలేంద్రు - చరణముల కోరగా మొక్కి చక్కనిల్చి.

అని ఈ విధంగా ఆ నాటి ఎఱుకలసాని వేషధారణను వర్ణించాడు.

1.ఇది దారికట్టు మొనక-ట్టిది కాంతావశ్యకర మిది నీమది కిం
పొదవించు నో నరేశ్వర-పదిలంబని తెల్పి కొన్ని బదనిక లొసగెన్

2.తలపున నిది గారడమని-తలపకుమా, సింగడల్ల తఱిగొండదరిన్
దలమోచి తెచ్చినవి ఇవి తలనుంచుము పసిడితాయెతల నుంచి నృపా.

అని ఈ విధంగా ఎఱుకలసాని విద్యలను వర్ణించాడు. ఇంకా ఎఱుకలవారి పుట్టు పూర్వోత్తరాలను గురించి వెంకటరాయ కవి వ్రాసిన లేపాక్షి జలక్రీడల్లో ఈ విధంగా వర్ణించాడు.

...అఖిల భూతముల - తెరగెల్ల భంగులు తెల్లంబుగాను
ఎఱుక గల్గినవార మాటకు మమ్ము
యెరుకల వారని యందురే చెలియ

అంటూ తనకు వచ్చిన విద్యలన్నింటిని వివరిస్తుంది.