పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

346

తాలాంకనందినీపరిణయము


గద్యపద్యాదివైశద్యవాద్యనిరూఢి
        సాధ్యవిద్యాధరస్తవము లెసఁగ


తే.

ధరణి యీనినగతి సురాసురబలములు
శ్రీరమణునకు నారేవతీరమణున
కెదుఱు నడచి మనోమైత్రి కుదుకుపఱచి
తోడుకొనివచ్చి నిఖిలసంస్తుతు లొనర్చి.

76


ఉ.

ఉన్నయెడన్ బలుండు హరియున్ శశిరేఖను జేరనేగి యో
కన్నులకల్కి రమ్మనుచుఁ గౌఁగిటజేర్చి నిజాంకసీమయం
దున్నతి నుంచి కన్గవలినొప్పెడు హర్షజలంబులన్ శిరం
బు న్నెనరంట మూర్కొనుచు బుజ్జగిల న్వచియించి రర్మిలిన్.

77


శా.

తల్లీ తల్లులఁ బాసి యేపగిది సంతాపించితో దైత్యుఁ డు
ద్యల్లీల న్నడిరేయి నిన్ గగనపంథానంబునం దెచ్చి యీ
భల్లోలూకభయంకరాటవిని జేర్ప న్నీవు భీతి న్మనః
కల్లోలంబున నెంత తల్లడిలితో కంజాతపత్రేక్షణా.

78


క.

ఐనా వగ పేటికి నీ
మేనత్తకడ న్వసించి మెలఁగుటచే ని
త్యానందమైన ద్వారక
లోనున్నటులగాదె లోలలోచన నీకున్.

79


మ.

శరజాతాంబకరూపశాలియగు నీజంభారిపౌత్రుండు ని
న్వరియింపంగలఁ డర్జునుం డతులితవ్యామోహతం గోడలం
చు రహి న్సంతస మందఁగా కొఱత లిచ్చో గల్గునే నీకు ని
త్తఱి గల్యాణ మొనర్పఁగా దలఁచి మాతల్లీ యిట న్వచ్చితిన్.

80


చ.

సుత నిటు లూరడించి నిజసోదరి నల్లుని గాంచి మీమన
స్స్థితహితకార్య మిప్పటికిఁ జేకురె మత్కృతవాక్ప్రచారసం