పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

345


చ.

మరుదధినాథుఁ డర్జునుఁడు మక్కువతో నభిమన్యుఁడున్న ద
ద్గిరిగుహ కేగఁగా నతఁడు గేవలభక్తి నమస్కరించినం
గరముల లేవనెత్తి చుబుకంబు బుణుంకుచు హర్షబాష్పముల్
దొఱయఁగ కౌఁగిలించి దయ దొట్రిల నంకములందు జేర్చియున్.

71


శా.

అన్నా నీ విటు మామపై నలిగి ఘోరారణ్యమార్గమ్ములం
దెన్నం డొందని బాధలం బొరయ నేఁ డిచ్చోట హైడింబుఁ డా
సన్నంబై యనుజప్రియాప్తి నలయించ న్నీవు నీతల్లియున్
మన్నారింతయె జాలు తండ్రి యిది సేమంబయ్యె నీనాఁటికిన్.

72


చ.

అని ప్రియభాషలం బలికి యవ్వల నాశశిరేఖనున్ సుభ
ద్రను గనుగొంచుఁ దత్తదుచితస్థితు లేర్పడ నాదరించి యం
తనె దనుజేంద్రునిం బొగడి దద్దయు వారును వారు మైత్రినె
మ్మన మలరన్ సుగంధసుమమంజులకుంజముల న్వసింపఁగన్.

73


చ.

అదె బలకృష్ణసాత్యకులు హస్తిరథాశ్వభటార్భటీజగ
ద్విదితము గాగ బంధుపరివేష్టితులై కలశాబ్ధివీచికా
భ్యుదయగతి న్వధూవరుల నొయ్యన దోడ్కొనిబోవ వచ్చిరం
చు దనుజకింకరు ర్టెలుప శూరవరుండు ఘటోత్కచుం డొగిన్.

74


చ.

సురలను హెచ్చరించి బలసూదను లెమ్మని విన్నవించి ఖ
ద్విరద మలంకరించి దిగధిప్రభులం గని వివరించి వా
ద్యరవము లుగ్గడించి పినతండ్రి కిరీటిని కౌఁగిలించి స
త్వరగతి మించి సీరిహలధారి నెదుర్కొనఁగా దలంచియున్.

75


సీ.

పాండురవేదండహిండచున్నతపీఠి
        గాండీవియాఖండలుండు జెలఁగ
మేషాదిసత్వరోన్మేషవాహము లెక్కి,
        హుతభుజప్రముఖదిక్పతులు నడవ
చటులాశనీసముత్కటహుటాహుటినట
        త్పటుభటార్భటులు దిక్తటము లొరయ