పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

333


త్తఱి (మన)బాలభద్రికి హితంబుగ నయ్యభిమన్యశౌరికిం
బరిణయమెల్ల దాకొనియె పౌరజను ల్వినఁగా దగుం జుమీ.

10


తే.

అవిన పౌరులు కర్ణరసాయనముగ
విని యఖర్వముదంబు హృద్వీథి బర్వ
కోటలను పౌధపంక్తులఁ గ్రొత్తడముల
విపణివీథుల శృంగారవిధు లొనర్చి.

11


మ.

భవనములన్ వితర్డుల సభాస్థలుల న్విపణివ్రజంబుల
న్నవఘనసారసిక్తమృగనాభిజలంబుల జిల్కి మేలిక్రొం
బవడఁపు గుజ్జుఁగంబములఁ బచ్చలతోరణముల్ ఘటించి సాం
కవరసకుంకుమాగురుసుగంధిలధూపము లుంచి రెత్తయున్.

12


సీ.

సాంకవపాటీరపంకమేళనమైన
        కాశ్మీరచూర్ణంబు గలియ నలికి
పన్నీట ముత్తెంపుసన్నంపుసున్నంపు
        టలుకుచిలుకులు రంగుదొలుక జిలికి
కమనీయకస్తూరికాకర్దమము నిండు
        సాదుపట్టెల సాలు సంఘటించి
కర్పూరచందనకలితమౌ గొజ్జంగి
        పూవునీటను కలాపులను జల్లి


తే.

ముంగిట బయళ్ల ముత్యాలమ్రుగ్గు దీర్చి
బంగరుజిలుంగుటనఁటిగంబముల నిలిపి
తళుకుమరకతతోరణముల నమర్చి
యపు డలంకృతి గావించి రప్పురంబు.

13


గీ.

పురుషు లతివ లఖిలభూషణవస్త్రమా
ల్యానులేపనముల నలరి వివిధ
హృద్యవాద్యతతు లవచ్యమై మ్రోయ మ
హోత్సవమున పురము నొప్పె కరము.

14