పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

334

తాలాంకనందినీపరిణయము


మ.

పుర మిబ్భంగి నలంకరింప బలదేవుం డచ్యుతుం డర్థి భూ
సురసంఘంబుల గాంచి యిట్లనిరి పూజ్యు ల్మాకు మీరౌట మ
ద్వరపుత్రీమణి నర్జునాత్మజున కీయన్ బుద్ధి దోచెన్ శుభ
స్థిరమౌహూర్తికలగ్న మవ్యవధి యోచింపందగు న్సత్కృపన్.

15


క.

అనిన హలి నిజమృదూక్తుల
కనురాగము నొంది విపులందఱ లిది మే
ల్పని యని యనుకొని మునుకొని
కనుగొని యనుఁగెనయ వినయగతి బల్కి రొగిన్.

16


చ.

తరుణికి పంకజప్రియహితంబు పదంబులయందు, తారకా
వరవరమైత్రియు న్నఖరపంక్తిని, మంగళశాలిదీప్తి వి
స్ఫురతరజంఘల, న్రుచిరవేణిని రాహుహితంబు చన్గవ
న్గురుసుకరావలోకనము గూడె నిదే సుముహూర్త మెల్లియున్.

17


చ.

అనుటకు సంతసింపుచు నృపాఢ్యులకున్ శుభలేఖ లంపు మే
ల్కనకఁపుఁ గాగితంబులను కస్తురిసారపునిగ్గు శాయిచే
సనయతగా లిఖించి తనచక్రమునన్ మొహరొత్తిపంపె న
వ్వనజదళాక్షుఁ డాత్మజవివాహసమాగతసూచనార్థమై.

18


క.

ఆశుభలేఖల భటు లవ
నీశుల కెల్లెడలవారి కిచ్చిన హరి ని
ర్దేశమని హర్షమానసు
లై శీర్షములం ధరించి యతివేగమునన్.

19


మ.

హలికన్యాప్రదుఁ డర్జునాత్మజుఁడు మేనల్లుండు బాధ్యుండు ద
త్ఫలసంధాయకుఁ డౌ చతుర్భుజుఁడుగా భావించి యీమేలువా
ర్తలు విన్నంతఁ గుతూహలం బెనయఁ దత్తద్దేశభూపాలమం
డలి విచ్చేసిన బంగరంపువిడిదిండ్ల న్నింపె సైనేయుఁడున్.

20


చ.

మును పరుదెంచినట్లు మునిముఖ్యులు రాజులు విప్రులుండ ద
క్కినసకలావనీజనులు కేవల మీయభిమన్యుపెండిలిం