పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

327


త్రామతనూభవాత్మజు యథాశుభసత్కృతి నిందుఁ దోడితే
నేమఱుదెంతు మీవచటి కేగు విలంబము మాని జాగ్రతన్.

320


మ.

అని వీడ్కొల్పిన వందనం బిడి నిలింపారాతి కౌతూహలం
బున నభ్రంబున కుగ్గళించి దిశ లబ్దుల్ మ్రోయ కోలాహల
ధ్వని గావించి యఱక్షణంబున నిజస్థానంబునం జేరి చే
సిన గార్యంబు సవిస్తరం బెఱుఁగజేసెం దల్లికిం దోడుకున్.

321


సీ.

శశిరేఖ నిటఁ బ్రవేశము జేసి తాదృశ
        రూపంబు బలునింట జూపుటయును
తుది ఘోరవికృతాకృతులు బన్ని లక్ష్మణు
        నగ్నాంగమున బాఱనడుపుటయును
దదుపరి కన్య నంతర్ధాన మొనరించ
        నచ్యుతాగ్రజముఖ్యు లడలుటయును
దాఁజేయు మాయాకదనమున కతిరథ
        సమరథసైన్యము ల్సమయుటయును


తే.

నార్తి బలభద్రుఁ డాహరి నడుగుటయును
దెలిసి యతఁ డియ్యకొనఁగ బోధించుటయును
బూసగ్రుచ్చినరీతి నద్భుతముగాను
సర్వ మెఱిఁగించుచున్నట్టి సమయమునను.

322


చ.

తెలతెలవాఱ తారకల దీప్తులు రాలె రథాంగకోటి నె
వ్వలు మదిలోన దూఱె, కృకవాఙ్నినదంబులు మీఱె, సారసం
బుల ముద మారె, చీఁకటులు భూధరగర్భములందు దూఱె, క
ల్వలయెడ నిద్ర జేరె, రవి ప్రాక్శిఖరిన్ రుచిదేరె తోరమై.

323


మ.

హిమభానుం డుదయంబునంది విధియయ్యె న్మున్ సువర్ణద్యుతి
న్విమలుఁడై యటమీఁద సోముఁ డనఁగా వెల్గొందె శుభ్రప్రభం
గ్రమమొప్పన్ హరిగాన నైల్యరుచి సంకాశించె మూర్తిత్రయా
ఖ్యమహి న్సత్యము సత్యమంచు కృకవాకధ్వానము ల్మోయఁగన్.

324