పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

326

తాలాంకనందినీపరిణయము


కడకు నూనియ నూవు లేకంబెకాని
గాండ్లవాఁ డొక్కరుఁడె తేఱగాఁడు కాఁడె.

314


క.

పంచాస్యభోగ్యవస్తువు
కొంచెపుశునకము భుజింపగోరినగతి గా
మించి యభిమన్యుపత్ని న
కించనుఁడగు లక్ష్మణుఁడు సుఖించఁగ వశమే!

315


క.

నీమేనల్లుఁడు సుత భగి
నీమణి యీమువ్వు రెనసి నిరుపమకుతుక
శ్రీమీర మదాశ్రమమున
సేమంబున నున్నవారు చింతిలనేలా!

316


మ.

భవదుత్సాహము మీఱఁ బౌరజనసద్బంధుప్రయుక్తంబు వై
భవలీలం ఘనతూర్యనాదములు మ్రోవన్ వే మదీయాశ్రమా
టవి కేతెంచి సహోదరీమణికి వేడ్కం జెంద కల్యాణ మ
వ్యవధిం జేయఁగ దోడితె మ్మఖిలలోకానందసంధాయివై.

317


తే.

తమ కనన్యుఁడు ఫల్గుణాత్మజుఁడు గాన
వేఱె మాబోఁటు లిది విన్నవింపవలెనె
తల పెఱుంగక నేజేయు ధౌర్త్యములకు
మదపరాధసహస్రముల్ మాన్పవలయు.

318


చ.

అని వినయంబునం దనుజుఁ డాడిన మాటల కచ్యుతాగ్రజుం
డనుమతిఁ బల్కె నీయభిమతార్థము మా కనుకూలమయ్యెఁ గా
వున నిక మాసుభద్ర కిది బోధపడ న్వినిపించి కౌతుకం
బెనయఁగ జేయు కార్యకృతహేతుసమర్థుఁడ వీవె గావునన్.

319


ఉ.

భీమతనూజు యీజగదభేద్యు సుయోధనుశ క్తి నీదుమా
యామహిమం జయించి విజయం బిట జెందితి వింకమీఁద సు